మైత్రీ మూవీ మేకర్స్ అండ్ క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మత్తువదలరా’. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. చిన్న బడ్జెట్తో వినూత్నమైన కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకోగా లేటెస్ట్గా చిత్రయూనిట్ని దర్శకధీరుడు రాజమౌళి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశాడు.
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుటుంబానికి చెందిన ఇద్దరు వారసులు ఈ సినిమాతో అరంగేట్రం అయ్యారు. దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న తనయుడు శ్రీసింహా హీరోగా, పెద్ద కుమారుడు కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్గా ఈ సినిమా తెరకెక్కింది. శ్రీసింహా, సత్య, అగస్త్యలను రాజమౌళి సరదాగా ఇంటర్వ్యూ చేశారు. సినిమా షూటింగ్లో ఆ ముగ్గురు ఎదుర్కొన్న కష్టాలు, బాధలను రాజమౌళితో పంచుకున్నారు.
ఈ సంధర్భంగా రాజమౌళి ఆసక్తికరంగా ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలో ఎవరైనా అబద్ధం చెబితే కొడతా అంటూ ముందే వార్నింగ్ ఇచ్చారు రాజమౌళి. మంచి, చెడు తెలిసినప్పుడు మాత్రమే ఫ్రెండ్ అవుతాడు. ముగ్గురి మధ్య ఫ్రెండ్ షిప్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా ఆసక్తికర సమాధానాలు చెప్పారు ముగ్గురు. అలాగే సినిమా తీసే సమయంలో ఎవరినైనా కొట్టాలని అనిపించిందా? అని ప్రశ్నించగా.. డైరెక్టర్ రితేష్ని కొట్టాలని అనిపించిందని సరదాగా సమాధానం చెప్పారు.