Rajinikanth : YCP నాయకులపై ఫైర్ అవుతున్న తలైవా ఫ్యాన్స్.. ట్రెండింగ్ లో #YSRCPApologizeRajini

విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుక కార్యక్రమంలో రజినీకాంత్ పాల్గొని సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు, బాలయ్యని పొగిడారు. వారితో తనకు ఉన్న స్నేహం గురించి చెప్పారు.

Rajinikanth :  ఇటీవల రజినీకాంత్(Rajinikanth) ఎన్టీఆర్(NTR) శతజయంతి వేడుకలకు విజయవాడకు(Vijayawada) హాజరయ్యారు. రజినీకాంత్ కు ఎప్పట్నుంచో బాలకృష్ణ(Balakrishna), ఎన్టీఆర్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. చంద్రాబుతో కూడా రజినీకాంత్ కు సత్సంబంధాలు ఉన్నాయి. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుక కార్యక్రమంలో రజినీకాంత్ పాల్గొని సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు, బాలయ్యని పొగిడారు. వారితో తనకు ఉన్న స్నేహం గురించి చెప్పారు.

అయితే గత రెండు రోజులుగా YCP నాయకులు రజినీకాంత్ పై ఫైర్ అవుతున్నారు. అసలు రజినీకాంత్ YCP గురించి కానీ, జగన్ గురించి కానీ, YCP నాయకుల గురించి కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఎన్టీఆర్ వేడుకలకు వచ్చాడు కాబట్టి ఎన్టీఆర్ తో పాటు అక్కడ స్టేజి మీద ఉన్న నాయకులని పొగిడాడు. అయితే చంద్రబాబుని పొగిడినందుకు కొడాలి నాని, రోజా, పేర్ని నాని, మధుసూదన్ రెడ్డి.. ఇలా పలువురు YCP నాయకులు రజినీకాంత్ ని దారుణంగా విమర్శించారు. అనకూడని మాటలన్నీ అన్నారు. అసలు ఆ మీటింగ్ కి, YCP కి సంబంధమే లేకపోయినా కేవలం చంద్రబాబుని పొగిడినందుకు రజినీపై YCP నాయకులు తీవ్ర విమర్శలు చేశారు.

దీంతో రజినీకాంత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అసలు రజిని రేంజ్ తో పిలిస్తే ఈ ycp నాయకులు ఎవ్వరూ కూడా రజినీకి సరితూగరు, దేశ విదేశాల్లో అభిమానులను సంపాదించుకున్నారు రజిని, పేరు, ప్రఖ్యాతలు, సంపదలు అన్ని కష్టపడి సంపాదించుకున్నారు. 70 ఏళ్ళ వయసులో కూడా రెస్ట్ తీసుకోకుండా అభిమానుల కోసం సినిమాలు చేస్తున్నారు అంటూ పోస్టులు పెడుతున్నారు. అలాంటి ఒక సూపర్ స్టార్ ని ఏపీలోని నాయకులు విమర్శిస్తున్నారు అని తెలియడంతో దేశవ్యాప్తంగా ఉన్న రజిని అభిమానులు ycp నాయకులపై ఫైర్ అవుతున్నారు. వైసీపీ రజినీకాంత్ కి సారి చెప్పాలని #YSRCPApologizeRajini అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్టులు పెడుతున్నారు. ఏకంగా ఈ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ ట్రెండ్ అయింది అంటే ఎంతమంది రజిని అభిమానులు ట్వీట్స్ చేశారో అర్థమైపోతుంది.

Biyyapu Madhusudan Reddy : రజనీకాంత్ పై ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అంతే కాక రజిని స్టైల్స్ లో మీమ్స్ వేస్తున్నారు. అసలు సంబంధమే లేని దాంట్లో దూరి వైసీపీ నాయకులు రజినీపై విమర్శలు చేయడంతో ఇలా రజిని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఫుల్ ఫైర్ అవుతున్నారు. మరి దీనిపై వైసీపీ నాయకులు మళ్ళీ స్పందించి ఏమైనా మాట్లాడతారేమో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు