Ram Charan : వీర్ సావర్కర్ జయంతి.. నిఖిల్‌తో పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేసిన రామ్ చరణ్.. టైటిల్ ఏంటో తెలుసా?

తాజాగా నేడు V మెగా పిక్చర్స్ బ్యానర్ నుంచి ఫస్ట్ సినిమాను ప్రకటించారు. ఎవ్వరూ ఊహించని విధంగా హీరో నిఖిల్ తో పాన్ ఇండియా సినిమా ప్రకటించారు రామ్ చరణ్.

Nikhil Siddhartha : ఇటీవల రామ్ చరణ్ UV క్రియేషన్స్ పార్ట్నర్ అయిన విక్రమ్ తో కలిసి V మెగా పిక్చర్స్ అనే బ్యానర్ ని స్థాపించినట్టు ప్రకటించారు. ఈ బ్యానర్ నుంచి మంచి మంచి సినిమాలను తెస్తామని తెలిపారు. తాజాగా నేడు V మెగా పిక్చర్స్ బ్యానర్ నుంచి ఫస్ట్ సినిమాను ప్రకటించారు. ఎవ్వరూ ఊహించని విధంగా హీరో నిఖిల్ తో పాన్ ఇండియా సినిమా ప్రకటించారు.

ఈ సినిమాని ప్రకటిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దీని గురించి రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ.. దేశ స్వంతత్ర సమరయోధుడు వీర సావర్కర్ 140వ జయంతి సందర్భంగా పాన్ ఇండియా సినిమా ‘ది ఇండియా హౌస్’ ని ప్రకటిస్తున్నందుకు గర్విస్తున్నాము. నిఖిల్ సిద్దార్థ, అనుపమ్ ఖేర్ ముఖ్యపాత్రల్లో రామ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనుంది. జైహింద్ అని దీనికి సంబంధించిన వీడియోని కూడా షేర్ చేశారు.

ఈ వీడియోలో.. దేశ చరిత్రలో మర్చిపోయిన కొన్ని నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. నిఖిల్ శివ అనే క్యారెక్టర్ లో, అనుపమ్ ఖేర్ శ్యామ్ జీ కృష్ణ వర్మ పాత్రల్లో నటిస్తున్నట్టు, స్వతంత్రం ముందు 1905లో జరిగిన కథతో తెరకెక్కుతున్నట్టు తెలిపారు. టైటిల్ ది ఇండియా హౌస్ అని ప్రకటించి కింద ట్యాగ్ లైన్ జై మాతాది అని వేశారు. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవలే నిఖిల్ కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన 18 పేజెస్ సినిమాతో మరో హిట్ కొట్టాడు. త్వరలో స్పై అనే పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ది ఇండియన్ హౌస్ సినిమా ప్రకటించారు. దీంతో నిఖిల్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇక రామ్ చరణ్ ఈ సినిమాని తన V మెగా పిక్చర్స్ తో పాటు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఎవరూ ఊహించని అప్డేట్ ఇచ్చి నిఖిల్, రామ్ చరణ్ అందర్నీ ఆశ్చర్యపరిచారు.

ట్రెండింగ్ వార్తలు