Chiranjeevi : చాలా గ్యాప్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాతో రాబోతున్నారు. మరాఠి సినిమా నటసామ్రాట్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్.. ఇతర నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ అవ్వగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది.
తాజాగా రంగమార్తాండ సినిమాకి చిరంజీవి వాయిస్ ఓవర్ అందించనున్నారు అని, బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాట, కవితలు కూడా చిరు తన వాయిస్ తో వినిపించనున్నారని ప్రకటించారు. రెగ్యులర్ వాయిస్ ఓవర్ కంటే కూడా కొత్తగా, మరింత ప్రభావవంతంగా ఉండేలా, కథలోని భావోద్వేగపూరితమైన సన్నివేశాలని సృశించేలా చిరు వాయిస్ ఓవర్ ఉండబోతుందని సమాచారం. ఇప్పటికే ఆ వాయిస్ ఓవర్ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది.
Venu Tottempudi : అందుకే ఇన్ని రోజులు సినిమాలకి దూరంగా ఉన్నాను..
తాజాగా కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలో నటించే వాళ్ళు అని ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ‘మన అమ్మానాన్నల కథ’ అంటూ ఇందులో నటించే ముఖ్య నటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని తెలిపారు. అయితే చివరిలో చిరంజీవి పేరు కూడా వేశారు. ఆ తర్వాత ఓ క్వశ్చన్ మార్క్ కూడా వీడియోలో వేయడంతో చిరు ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వడమే కాక ఇందులో ఏదైనా స్పెషల్ పాత్రలో నటిస్తున్నారా అని చర్చిస్తున్నారు. చిరంజీవి రంగమార్తాండ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో ఆ చిత్ర యూనిట్ కే తెలియాలి. దీనిపై కృష్ణవంశీ స్పందించలేదు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మెగా ఫ్యాన్స్ కి పండగే.