Naresh : ఢిల్లీ ఘటనపై నరేష్ సంచలన ట్వీట్.. 118 మంది పోలీసులు గాయపడ్డారు..

సీనియర్ నటుడు నరేష్ స్పందిస్తూ తన సోషల్ మీడియాలో సంచలన ట్వీట్ చేసారు. (Naresh)

  • Published on- July 21, 2026 / 10:23 PM IST

Naresh

Naresh : నేడు ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన ‘ఛలో పార్లమెంట్’ ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. కాక్రోచ్ పార్టీ మద్దతుదారులతో పాటు, పలువురు రాజకీయ నాయకులు, బయటి వ్యక్తులు కూడా ఈ కార్యక్రమంలో చేరారు. అయితే నిరసనకారులు బారికేడ్లను దాటుకుని పార్లమెంట్ ఆవరణలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకోవడంతో కొంతమంది పోలీసులపై దాడి చేసారు. పలు వాహనాలను ధ్వంసం చేసారు. దీంతో వారిపై పోలీసులు లాఠీఛార్జి చేసి టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులతో పాటు పోలీసులు కూడా గాయపడ్డారు.

దీనిపై సీనియర్ నటుడు నరేష్ స్పందిస్తూ తన సోషల్ మీడియాలో సంచలన ట్వీట్ చేసారు.

Also Read : Kiran Abbavaram : ఆ సినిమా వద్దు అని చెప్పాను.. సాయి ధరమ్ తేజ్ అన్న చేస్తున్నాడు.. కిరణ్ అబ్బవరం కామెంట్స్..

నరేష్ తన ట్వీట్ లో.. నీట్ పేపర్ లీక్ ఒక తీవ్రమైన సమస్య. ప్రభుత్వం దీనిని మరింత మెరుగ్గా నిర్వహించి ఉండాల్సింది. కానీ పరీక్షలు ముగిసి ఫలితాలు వెలువడిన తర్వాత ఢిల్లీలో జరిగిన హింసాకాండ, దీనివల్ల 118 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఇది మరిన్ని పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇది భారత భూభాగం వెలుపల జరుగుతున్న ఒక రహస్య ప్రభుత్వ కుట్రకు కేవలం ఒక ప్రేరేపణ మాత్రమేనా? అర్థరహితమైన హింస తర్వాత, భారతదేశాన్ని మరో నేపాల్ గా మార్చాలని అభిషేక్ దీప్కే పిలుపునిస్తున్నట్లయితే వాటిని తీవ్రంగా పరిగణించాలి. అవి యువతను మరింత దురాక్రమణకు ప్రేరేపించేలా తప్పుదోవ పట్టించవచ్చు. శాంతియుత నిరసన అనేది ఒక ప్రజాస్వామ్య హక్కు, కానీ దేశాన్ని అస్థిరపరిచేందుకు సంఘవిద్రోహ శక్తులు లేదా పెద్ద కుట్రపూరిత శక్తులు చేసే ఏ ప్రయత్నమైనా సమగ్ర విచారణకు అర్హమైనది. జాతీయ ప్రయోజనాలకే ఎల్లప్పుడూ ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి అని తెలిపారు. దీంతో నరేష్ ట్వీట్ వైరల్ గా మారింది.