Sivaji made interesting comments at Dhandoraa movie thank you meet
Shivaji: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల వచ్చిన కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ దండోరా. శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి, మౌనిక రెడ్డి, రవి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సామాజిక అంశాలు, వెనుకబాటు తనం, కాస్ట్ లాంటి అంశాలను ప్రస్తావిస్తూ వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాను లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ నిర్మాణంలో దర్శకుడు మురళీకాంత్ తెరకెక్కించాడు.
Rashi Khanna: చీరలో మెరిసిపోతున్న రాశి ఖన్నా.. ట్రెడిషనల్ లుక్ లో క్రేజీ ఫొటోలు
తాజాగా ప్రకటించిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ లో సత్తా చాటింది ఈ సినిమా. ఏకంగా మూడు విభాగాల్లో అవార్డులు సాధించింది దండోరా మూవీ. ఈ నేపధ్యంలోనే మూవీ టీం ఆనందం వ్యక్తం చేశారు. థాంక్ యూ మీట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నటుడు శివాజీ(Shivaji) మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. “మా ‘దండోరా’ సినిమాకు అవార్డుల్ని ఇచ్చిన జ్యూరీకి, తెలంగాణ ప్రభుత్వానికి మా ధన్యవాదాలు.
జూనియర్ ఎన్టీఆర్ వేసిన ట్వీట్తో ఈ సినిమా తెలుగు వారందరికీ చేరువయ్యింది. ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన మార్క్ కె రాబిన్ గారికి అవార్డు రావడం చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఈ అవార్డుల్లో భాగం ఉంది. దర్శకుడు మురళీకాంత్ ‘దండోరా’ సినిమా కథను మా కోసమే రాసినట్టుగా అనిపిస్తోంది. రాత్రి పూట రెండు, మూడు గంటలు మాత్రమే నిద్రపోయి ఈ పాత్ర కోసం, లుక్ కోసం సిద్ధం అయ్యాను. ఈ సినిమాలో రాధ్య పాప పాత్ర లేకపోతే నేను ఈసినిమా చేసేవాణ్ణి కాదు. ఈ మూవీ ఇక్కడ ఆగేది కాదు.. మున్ముందు చాలా అవార్డులు వస్తాయి” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో, శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.