Wayanad Helping : ఇటీవల కేరళ వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగి పడి అనేకమంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. కేరళలో వర్షాలు, వరదలు కారణంగా వయనాడ్ లో భారీ ప్రకృతి విపత్తు ఏర్పడింది. అక్కడి ప్రజలకు ఈ విపత్తు ఎంతో విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికే 300 మందికి పైగా ఈ ఘటనలో చనిపోగా అనేకమంది నిరాశ్రయులు అయ్యారు. దీంతో వయనాడ్ బాధితులకు దేశ వ్యాప్తంగా విరాళాలు వస్తున్నాయి.
అనేకమంది సినిమా సెలబ్రిటీలు కూడా ఇప్పటికే కేరళ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందచేశారు. మన టాలీవుడ్ నుంచి కూడా ప్రభాస్ రెండు కోట్లు, చిరంజీవి, చరణ్ కోటి రూపాయలు, అల్లు అర్జున్ 25 లక్షలు, రష్మిక 10 లక్షలు, నిర్మాత నాగవంశీ 5 లక్షలు.. ఇలా పలువురు సెలబ్రిటీలు విరాళాలు ఇచ్చారు. తమిళ, మలయాళ సినీ పరిశ్రమ నుంచి కూడా అనేకమంది ప్రముఖులు విరాళాలు అందచేశారు.
Also Read : Kalyan Ram – NTR : పెదనాన్న కళ్యాణ్ రామ్తో ఎన్టీఆర్ పిల్లల సందడి.. భార్గవ్ని ఎత్తుకొని.. ఫొటోలు వైరల్..
అయితే తాజాగా అలనాటి సౌత్ హీరోయిన్స్ అంతా కలిసి డబ్బులు పోగేసి కోటి రూపాయలను కేరళ సీఎం పినరయి విజయన్ కు అందచేశారు. మీనా, కుష్బూ, సుహాసిని, మరికొంతమంది డైరెక్ట్ గా వెళ్లి కేరళ సీఎంకు కోటి రూపాయల చెక్కు అందచేశారు. ఈ ఫోటోలని షేర్ చేస్తూ సీనియర్ నటి మీనా తన సోషల్ మీడియాలో.. చెన్నై నుంచి మేము కొంతమంది మా ఫ్యామిలీలు, ఫ్రెండ్స్ తరపున వయనాడ్ బాధితుల కోసం కోటి రూపాయల డబ్బులు పోగేసాం. కేరళ సీఎం పినరయి విజయన్ గారిని కలిసి కోటి రూపాయల చెక్కుని అందించాము. ఇందుకు సహకరించిన సుహాసిని, శ్రీప్రియ, కుష్బూ, మీనా, కళ్యాణి ప్రియదర్శన్, లిస్సి లక్ష్మి, శోభన.. వీరి ఫ్యామిలీలకు అభినందనలు. వయనాడ్ కోసం మేము ప్రార్ధిస్తున్నాము అని పోస్ట్ చేసింది. దీంతో సీనియర్ నటీనటులు చేసిన ఈ పనికి వారిని అందరూ అభినందిస్తున్నారు.