Nandini Agasara : ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ(Sridevi Drama Company) షోలో ప్రతివారం చాలామంది ట్యాలెంటెడ్ వ్యక్తులని తీసుకువస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ట్యాలెంట్ ఉండి, గుర్తింపు లేని వాళ్ళని, పాపులర్ అయిన వాళ్ళని తీసుకొచ్చి వారి గురించి చెప్తారు. అందులో ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆ షోలో ఉండే సెలబ్రిటీలు వారికి తోచినంత సహాయం చేస్తారు. తాజాగా ఈ టీవీ షోకి అథ్లెటిక్ ఛాంపియన్ నందిని అగసర వచ్చింది.
నందిని అగసర అథ్లెటిక్స్ లో నేషనల్ లెవల్లో ఎన్నో పతకాలు సాధించింది. ఇంటర్నేషనల్ లో ఆసియన్ గేమ్స్ లో కాంస్య పతకం కూడా సాధించింది. ఇక స్టేట్ లెవెల్లో అయితే కొన్ని వందల పతకాలు సాధించింది నందిని. తాజాగా నందిని తన పేరెంట్స్ తో కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీకి రాగా తను మాట్లాడుతూ.. తన ఫ్యామిలీ కష్టాల్లో ఉందని, ఎన్ని పతకాలు వచ్చినా ఒక్కోసారి తినడానికి కూడా తిండి ఉండట్లేదంటూ ఎమోషనల్ అయింది.
Also Read : Hanuman : ‘హనుమాన్’ సరికొత్త రికార్డ్.. ఏకంగా 300 సెంటర్స్లో.. చాలా ఏళ్ళ తర్వాత సినీ పరిశ్రమలో ఇలా..
దీంతో షోలో ఉన్న హైపర్ ఆది(Hyper Aadi).. ఇలాంటి ఛాంపియన్ కి తినడానికి కూడా లేదంటే చాలా బాధగా ఉంది అంటూ ఆ ఎపిసోడ్ కి వచ్చే పేమెంట్ తనకు ఇస్తానని ప్రకటించాడు. ఇంద్రజ కూడా తనకు తోచినంత సాయం చేస్తానని చెప్పి కొంత అమౌంట్ ఇచ్చింది. తాగుబోతు రమేష్ కూడా ఆ ఎపిసోడ్ పేమెంట్ తనకే ఇస్తానని ప్రకటించాడు. ఆ షోలో ఉన్న మరికొంతమంది కూడా కొంత అమౌంట్ హెల్ప్ చేసినట్టు సమాచారం. దీంతో ప్రేక్షకులు ఆ షోని, ఆమెకు సహాయం చేసిన వారిని అభినందిస్తున్నారు.