Gaanja Shankar : సాయి ధరమ్ తేజ్ సినిమాకి.. తెలంగాణ పోలీసులు నోటీసులు..

మొన్నటి వరకు ఆగిపోయిందంటూ వార్తలు వినిపించిన సాయి ధరమ్ తేజ్ సినిమాకి తెలంగాణ పోలీసులు నోటీసులు పంపించడం వైరల్ గా మారింది.

TELANGANA ANTI NARCOTICS BUREAU issues notice to Sai Dharam Tej Gaanja Shankar movie

Gaanja Shankar : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ.. గత ఏడాది విరూపాక్ష, బ్రో సినిమాలతో ఆడియన్స్ ని బాగా అలరించారు. ఇక ఈ రెండు చిత్రాలు తరువాత తేజ్ చేస్తున్న సినిమా ‘గాంజా శంకర్’. టాలీవుడ్ మాస్ దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ లోనే అనౌన్స్ చేసిన ఈ చిత్రం.. ఆగిపోయిందని ఈ మధ్యలో కొన్ని వార్తలు కూడా వచ్చాయి.

అయితే తాజాగా ఈ సినిమా మేకర్స్ కి తెలంగాణ పోలీసులు హెచ్చరిక నోటీసులు పంపించడంతో.. ఈ మూవీ ఇంకా సెట్స్ పైనే ఉందని సమాచారాన్ని ఇస్తుంది. అసలు ఇంతకీ పోలీసులు ఎందుకని నోటీసులు పంపించారు. దానికి కారణం ఏంటంటే.. ఈ సినిమా టైటిల్. మూవీ టైటిల్ లో ‘గాంజా’ అంటూ డ్రగ్స్ కి సంబంధించిన పదం ఉండడం పై తెలంగాణ నార్కోటిక్ పోలీసులు అభ్యంతరం తెలియజేసారు.

Also read : Mahesh Babu – Pawan Kalyan : మహేష్, పవన్‌తో ఆ తరహా సినిమా చేస్తానంటున్న క్రియేటివ్ డైరెక్టర్..

సినిమా టైటిల్ ని మార్చాలని, అలాగే సినిమాలో గాంజాకి సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలిగించాలని.. సాయి ధరమ్ తేజ్‌, దర్శకుడు సంపత్ నంది, నిర్మాత నాగవంశీతో పాటు తెలుగు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి కూడా నోటీసులు పంపించింది. ప్రస్తుతం ఈ నోటీసులు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ నోటీసులతో సినిమా ఆగిపోలేదు అని క్లారిటీ రావడంతో మెగా ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

కాగా ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. తెలంగాణ బ్యాక్‌డ్రాప్ పక్కా మాస్ కమర్షియల్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కనుంది. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. మరి ఈ మూవీ పై చిత్ర నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

ట్రెండింగ్ వార్తలు