Premam : మూడోసారి రీ రిలీజ్ అయినా కోట్లు కొల్లగొడుతున్న ఆ సినిమా

2015 లో వచ్చిన 'ప్రేమమ్' సినిమా ఎంత క్రేజ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. 9 సంవత్సరాల క్రితం రిలీజైన ఈ సినిమా మూడోసారి రీ రిలీజైనా అదే క్రేజ్‌తో దూసుకుపోతోంది.

Premam

Premam : మళయాళ సినిమా ‘ప్రేమమ్’ సరిగ్గా 9 సంవత్సరాల క్రితం రిలీజైంది. రీసెంట్‌గా ఈ సినిమా  తమిళనాడులో ఫిబ్రవరి 1న రీ రీలీజైంది. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఈ సినిమా క్రేజ్  ఏ మాత్రం తగ్గలేదు. మూవీ భారీ కలెక్షన్స్ రాబడుతోంది.

Premalatha Vijayakanth : భర్త మరణం తర్వాత విజయ్‌కాంత్ భార్య ఏం చేసిందో తెలుసా?

మళయాళ ప్రేమ కథ ‘ప్రేమమ్’ 2015 లో విడుదలైంది. ఆల్ఫోన్స్ పుత్రేన్ ఈ సినిమాను డైరెక్ట్ చేసారు. నివిన్ పౌలీ, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాన్ని అన్వర్ రషీద్ నిర్మించారు. ఇంకా ఈ సినిమాలో మడోన్నా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్, అనంత్ నాగ్ వంటివారు కీలక పాత్రల్లో నటించారు. 4 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా అప్పట్లో రూ.73 కోట్లు వసూలు చేసింది. తాజాగా ఈ సినిమా తమిళనాడులో ఫిబ్రవరి 1 న రీ రిలీజ్ చేశారు. మూడోసారి రీ రిలీజ్ అయినా సరే సినిమాపై  క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. విడుదలైన 5 రోజుల్లో రెండు కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం రిలీజ్‌కి పెద్ద సినిమాలు లేకపోవడంతో చెన్నైలోని అనేక థియేటర్లలో ప్రేమమ్ రిలీజ్ చేశారు.

Malvi Malhotra : ఆ నిర్మాత నన్ను మోసం చేసారు.. నటి సంచలన ఆరోపణలు

ప్రేమమ్ గతంలో 2016 వేలంటైన్స్ డేకి మొదటిసారి రీ రిలీజ్ చేశారు. 2017 లో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరేళ్ల గ్యాప్‌లో మరోసారి ప్రేమమ్ రిలీజైంది. ఈ సినిమాతోనే సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రేమమ్ సినిమాను అదే పేరుతో తెలుగులో 2016 లో రీమేక్ చేశారు. నాగ చైతన్య హీరోగా నటించిన తెలుగు వెర్షన్ చందూ మొండేటి డైరెక్ట్ చేశారు. కాగా సాయి పల్లవి పాత్రలో శృతిహాసన్ నటించారు. అయితే ఒరిజినల్‌కి వచ్చిన క్రేజ్ తెలుగు వెర్షన్ సంపాదించుకోలేకపోయింది.

ట్రెండింగ్ వార్తలు