SS Rajamouli - Ramoji Rao
SS Rajamouli – Ramoji Rao : ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్సిటీకి తరలించారు. ప్రముఖుల, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం ఉదయం ఫిల్మ్సిటీలో జరగనున్నాయి.
పలువురు ప్రముఖులు రామోజీ చేసిన చేసిన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలో రామోజీకి భారత రత్న ఇవ్వాలని దర్శకదీరుడు రాజమౌళి కోరారు. స్థితిస్థాపకత, కృషి, ఆవిష్కరణలతో ఓ వ్యక్తి 50 సంవత్సరాలు లక్షలాది మందికి ఉపాధి, జీవనోపాధి, ఆశలను అందించాడు. అలాంటి రామోజీరావుకి మనం నివాళులు అర్పించే ఏకైక మార్గం భారత రత్నను ప్రధానం చేయడం అని రాజమౌళి ట్వీట్ చేశారు.
Game Changer : గేమ్ ఛేంజర్ చిత్రీకరణలో రామోజీరావుకి అశ్రు నివాళి అర్పించిన రామ్ చరణ్, దర్శకుడు శంకర్
ONE man with his 50 years of resilience, hardwork and innovation provided employment, livelihood and hope for millions. 🙏🏻🙏🏻
The only way we can pay tribute to Ramoji Rao garu is conferring him with “BHARAT RATNA”
— rajamouli ss (@ssrajamouli) June 8, 2024
Anchor Syamala : నాకు భయమేస్తుంది.. బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.. యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు..
ఫిల్మ్ సిటీకి వెళ్లిన రాజమౌళి.. రామోజీరావు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. రామోజీ భౌతికకాయాన్ని చూడగానే కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. తీవ్ర భావోద్వేగానికి లోనైయ్యారు. ‘శాంతి నివాసం’ సీరియల్, ‘బాహుబలి’ వంటి సినిమాలను రాజమౌళి రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. రామోజీతో రాజమౌళికి విడదీయరానీ అనుబంధం ఉంది.