Tillu Square : టిల్లు కోసం మహేష్‌ సినిమాని వెనక్కి తీసుకెళ్లిన నిర్మాత.. మెగాస్టార్‌కి పోటీ?

మహేష్ బాబు (Mahesh Babu) SSMB28 సినిమాని వెనక్కి తీసుకువెళ్లి 'టిల్లు స్క్వేర్' ని (Tillu Square) ముందుకు తీసుకు రావడానికి నిర్మాత ప్లాన్ చేశాడట.

Tillu Square : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మూడో సినిమా ‘SSMB28’. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రాలు ఖలేజా, అతడు మంచి ప్రజాధారణ పొందయాయి. దీంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియన్స్ లో సినిమా పై మరింత క్యూరియాసిటీని పెంచింది. ఈ చిత్రాన్ని ఆగష్టు 11న ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తామంటూ నిర్మాత నాగవంశీ మొన్నటి వరకు చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి పోస్ట్‌పోన్ చేశాడు.

Mahesh Babu : సొంత రెస్టారెంట్ లో ఫస్ట్ టైం ఫ్యామిలీతో కలిసి తినడానికి వచ్చిన మహేష్

అయితే తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్త ఏంటంటే.. అదే డేట్ కి నాగవంశీ నిర్మిస్తున్న మరో సినిమా ‘టిల్లు స్క్వేర్’ ని (Tillu Square) తీసుకు రావడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మహేష్ సినిమాని వెనక్కి తీసుకు వెళ్లినా, ఆ డేట్ ని మాత్రం తమదే అంటూ టిల్లుని తీసుకు వచ్చేస్తున్నాడు నాగవంశీ. అయితే అదే డేట్ కి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా వస్తున్నాడు. చిరు నటిస్తున్న భోళాశంకర్ (Bholashankar) సినిమా కూడా అదే రోజు రిలీజ్ కాబోతుంది. దీంతో టిల్లుకి బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీ ఉంటుంది. అయితే టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ పై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.

Chiranjeevi : అల్లు అర్జున్ 20 ఇయర్స్ జర్నీ.. చిరు ఎమోషనల్ పోస్ట్!

ఒకవేళ అదే డేట్ కి వస్తే, టిల్లు ఈసారి ఇంకొంచెం ఎక్కువుగా డీజే వాయించాలిసిందే. కాగా ఈ సినిమా 2022 లో సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ‘డీజే టిల్లు’కి (DJ Tillu) సీక్వెల్ గా వస్తుంది. ఆ మూవీ సూపర్ హిట్టు కావడమే కాకుండా, యూత్ లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకోవడంతో.. సీక్వెల్ తీసుకు వచ్చేందుకు మేకర్స్ ముందుకు వచ్చారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా నటిస్తుంది.

 

ట్రెండింగ్ వార్తలు