Uday Kiran Sister Sridevi Talks About Chiranjeevi Issue
Uday Kiran : ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులని మెప్పించిన ఉదయ్ కిరణ్ మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ అనుకోకుండా ఆత్మహత్య చేసుకొని అభిమానులకు, కుటుంబానికి తీవ్ర విషాదం ఇచ్చాడు. అయితే ఉదయ్ కిరణ్ మరణించినప్పుడు అప్పటికే అతను వరుస ఫ్లాప్స్ లో ఉండటంతో సినిమాల ఫలితాల వల్ల, ఛాన్సులు రావట్లేదని, ఫైనాన్సియల్ ఇబ్బందుల వల్ల, భార్యతో విభేదాల వల్లే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు వచ్చాయి.
అయితే చిరంజీవి(Chiranjeevi) పెద్ద కూతురుతో ఉదయ్ కిరణ్ నిశ్చితార్థం జరిగింది. కానీ ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయింది. దీంతో చిరంజీవి కావాలని ఉదయ్ కిరణ్ ని తొక్కేసాడని, సినిమా ఛాన్సులు రాకుండా చేసాడని పలువురు వ్యాఖ్యానించారు, విమర్శలు చేసారు. ఇప్పటికి కొంతమంది చిరంజీవి అంటే గిట్టని వాళ్ళు ఇదే విషయం గురించి మాట్లాడతారు.
Also Read : YVS Chowdary : రీ ఎంట్రీతో ఎన్టీఆర్ని లాంచ్ చేయబోతున్న వైవిఎస్ చౌదరి?
ఉదయ్ కిరణ్ నువ్వు నేను సినిమా రీ రిలీజ్ అవ్వడంతో ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. గతంలో కూడా చిరంజీవి – ఉదయ్ కిరణ్ ఇష్యూ గురించి మాట్లాడిన ఈవిడ తాజాగా మరోసారి ఈ ఇష్యూ మీద మాట్లాడింది.
ఓ ఇంటర్వ్యూలో ఈ ఇష్యూ గురించి అడగడంతో ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి ఉదయ్ కిరణ్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్. చిన్నప్పుడు ఓ ఈవెంట్లో ఆయన్ని కలిస్తే చాలా ఎగ్జైట్ అయ్యాడు. సినిమాల్లోకి వచ్చాక చిరంజీవి ఉదయ్ కి సపోర్ట్ చేసారు. ఉదయ్ కిరణ్ కి చిరంజీవి గాడ్ ఫాదర్ లాగా ఉండేవారు. సినిమాల గురించి కూడా ఉదయ్ చిరంజీవితో చర్చించేవారు. ఉదయ్ ఇప్పుడు లేడు. జరిగిందేదో జరిగింది. దానికి నేనెవర్ని తప్పుపట్టను. వాటి గురించి ఉదయ్ లేకపోయినా మాట్లాడటం బాధగా ఉంటుంది. కానీ చిరంజీవి గారు ఉదయ్ కి చాలా సపోర్ట్ ఇచ్చారు అని తెలిపింది. దీంతో ఉదయ్ కిరణ్ సోదరి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.