దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ను మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. సినీ రంగంలో చేసిన సేవలకు గాను ఈ అవార్డు ఆయన్ను వరించింది. గురువారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ, కూతురు సుస్మిత, రామ్ చరణ్, ఉపాసన లు పాల్గొన్నారు.
కాగా.. ఈ అవార్డు కార్యక్రమంలో పాల్గొనే ముందు డ్రెస్సింగ్ రూమ్లో చిరంజీవికి ఓ చిన్న ఫోటో షూట్ను నిర్వహించారు. ఈ సమయంలో కోడలు ఉపాసన మామయ్య చిరుని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేసింది.
Aarambham Review : ‘ఆరంభం’ మూవీ రివ్యూ.. సైన్స్ ప్రయోగం కథకి ఎమోషన్స్ జోడించి..
ఓ వీడియోలో.. క్లీంకార, నాలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి మామయ్య అంటూ చిరంజీవిని ఉపాసన ప్రశ్న అడిగింది. తాను నీకు మరో ప్రతిరూపం అంటూ చిరు సమాధానం ఇవ్వగా.. దానికి ఉపాసన అది కాదు మామయ్య.. మా ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్ ఏమిటంటే.. మా ఇద్దరి తాతయ్యలు పద్మ విభూషణ్ గ్రహీతలు అంటూ చెప్పింది. ఉపాసన తాతయ్య ప్రతాప్ చంద్రారెడ్డి 2010లో పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే.
#Chiranjeevi & #Upasanakonidela & #RamCharan 😍🤩 pic.twitter.com/PsrCyIvfae
— Filmy Bowl (@FilmyBowl) May 9, 2024
మరో వీడియోలో.. ఈ రోజు మీ ఫీలింగ్స్ ఏంటి మామయ్య అని అడిగింది. ఓ మంచి కోడలు నాకు క్లీంకారని మనువరాలిగా ఇచ్చిన తరువాత దక్కిన అవార్డు అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.
Allu Arjun : అల్లు అర్జున్ మంచి మనసు.. వాళ్ళ కోసం రూ.10లక్షలు..
క్లిన్ కార వచ్చాక నా పెద్ద అవార్డ్ 😍😍❤️❤️#PadmaVibhushan #MegastarChiranjeevi #KlinKara @upasanakonidela @AlwaysRamCharan @KChiruTweets pic.twitter.com/Yw31ZPp4rs
— షరీఫ్ జి #VoteForGlass (@GagguturuSharif) May 9, 2024
కాగా.. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు వైరల్గా మారాయి.