Venkatesh : విక్టరీ వెంకటేష్ ‘సైంధవ్’ సినిమాతో ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం వెంకీ మామ కెరీర్లో 75వ సినిమాగా వస్తుంది. దీంతో వెంకటేష్ ఈ సినిమా ప్రమోషన్స్ లో హుషారుగా పాల్గొంటూ సందడి చేస్తూ వస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ట్రైలర్ రిలీజ్ అనంతరం వెంకటేష్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈక్రమంలోనే తన కొడుకు అర్జున్ గురించి మాట్లాడారు.
‘మీ అబ్బాయి అర్జున్ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని మీ అభిమానులు కోరుకుంటున్నారు’ అని విలేకరి ప్రశ్నించగా, వెంకటేష్ బదులిస్తూ.. “ప్రస్తుతం తను బాగా చదువుకుంటున్నాడు. ఎవరైనా సరే ముందు బాగా చదువుకోలి. ఆ తరువాత ఏం జరుగుతుంది అనేది తరువాత చూసుకోవాలి” అని బదులిచ్చారు. కాగా వెంకటేష్ కూడా సినిమాల్లోకి రావడానికంటే ముందు.. ఫారిన్ వెళ్లి తన ఎడ్యుకేషన్ ని పూర్తి చేశారు.
ఆ తరువాతే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు వెంకీ కొడుకు అర్జున్ కూడా అదే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. వెంకీ మాటల్లో విన్న తరువాత ప్రస్తుతం అర్జున్ కంప్లీట్ స్టడీస్ మీద ఫోకస్ చేశాడని అర్ధమవుతుంది. కాగా సీనియర్ హీరోల్లో బాలకృష్ణ, నాగార్జున వారసులు.. ఇండస్ట్రీకి వచ్చేశారు. ఇంక బ్యాలన్స్ ఉన్నది బాలయ్య, వెంకటేష్ వారసులే. ఈ ఏడాది బాలకృష్ణ వారసుడి ఎంట్రీ కూడా జరిగిపోతుందని చెబుతున్నారు.
Also read : Guntur Kaaram : గుంటూరు కారం ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ.. ఒక ఫైట్లో కృష్ణని కూడా..
ఇక సైంధవ్ విషయానికి వస్తే.. హీరో తన చీకటి గతాన్ని వదిలేసి తన పాప కోసం బతుకుతుంటాడు. అయితే పాపకి ఓ అరుదైన వ్యాధి వస్తుంది. పాపకి ఓ ఇంజెక్షన్ ఇస్తే బతుకుతుంది. కానీ దాని విలువ 17 కోట్లు. దీంతో సైంధవ్ ఏం చేశాడు. మళ్ళీ తన గతంలోకి వెళ్లాడా? సైంధవ్ అంతకు ముందు అసలు ఏం చేశాడు అనే దానిపై కథ ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది.