Venky Atluri: ముచ్చటగా మూడోసారి ఆ బ్యానర్‌తో చేతులు కలిపిన వెంకీ అట్లూరి

‘సార్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి, తన నెక్ట్స్ ప్రాజెక్టును మరోసారి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో చేసేందుకు రెడీ అవుతున్నాడు.

Venky Atluri: టాలీవుడ్‌లో వరుస సినిమాలతో సక్సెస్ అందుకుని తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఈ డైరెక్టర్ తెరకెక్కించిన రీసెంట్ మూవీ సార్(తమిళ్‌లో ‘వాతి’) ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. తమిళ హీరో ధనుష్ ముఖ్య పాత్రలో నటించిన ‘సార్’ మూవీ తమిళ్‌తో పాటు తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేసింది.

Director Venky Atluri : త్రివిక్రమ్ గారిని చూసి రైటర్ అయ్యాను. ఇప్పుడు నా సినిమాకి ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు..

ఇక సార్ చిత్ర సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న వెంకీ, ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టును రెడీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సార్ వంటి బ్లాక్‌బస్టర్ తరువాత వెంకీ అట్లూరి తన నెక్ట్స్ సినిమాను ఎవరితో చేస్తాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే, తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా వెంకీ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మరోసారి ఈ డైరెక్టర్‌ను లాక్ చేసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లోని 24వ ప్రాజెక్టును వెంకీ అట్లూరి డైరెక్ట్ చేయబోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు.

Venky Atluri : మీమ్స్ వల్లే అలాంటి సినిమాలు తీయకూడదని ఫిక్స్ అయ్యా.. డైరెక్టర్ వెంకీ అట్లూరి..

కాగా, గతంలో ఇదే బ్యానర్‌లో వెంకీ అట్లూరి రంగ్‌దే, సార్ చిత్రాలను తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. దీంతో ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఇదే బ్యానర్‌తో సినిమా చేసేందుకు వెంకీ రెడీ అవుతుండటంతో ఈ సినిమాను వెంకీ ఎలాంటి కథతో తెరకెక్కిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు