Vishal
Vishal : కోలీవుడ్ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోనీ’ (Mark Antony). ఈ మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉండడంతో.. ప్రమోషన్స్ తో సందడి చేస్తున్నాడు. ఈక్రమంలోనే పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో విశాల్ మాట్లాడుతూ.. తాను గతంలో నటించిన ‘తుప్పరివాలన్’ (Thupparivaalan) సినిమా దర్శకుడు పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సినిమా తెలుగులో ‘డిటెక్టివ్’ పేరుతో డబ్ అయ్యి రిలీజ్ అయ్యింది. ఇక్కడ కూడా ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.
Pushpa 2 : పుష్పరాజ్ చిటికెన వేలు గోరు.. నెట్టింట చర్చ..
ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు మిస్కిన్ (Mysskin) తెరకెక్కించాడు. ఇక ఈ మూవీ మంచి విజయ సాధించడంతో దీనికి సీక్వెల్ తీసుకు వచ్చేందుకు ‘తుప్పరివాలన్-2’ని కూడా మొదలు పెట్టారు. షూటింగ్ మొదలు పెట్టి కొన్ని సీన్స్ చిత్రీకరణ కూడా చేశారు. అయితే దర్శకుడు మిస్కిన్, విశాల్ మధ్య విబేధాలు రావడంతో మూవీ నిలిచిపోయింది. తాజాగా ఈ విషయం గురించి విశాల్ నోరు విప్పాడు.
Chandramukhi 2 : చంద్రముఖి నుంచి ‘థోరి బోరి’ లిరికల్ సాంగ్ రిలీజ్..
“మిస్కిన్ తో కలిసి మరోసారి పని చేసే అవకాశం వచ్చినా నేను చేయదల్చుకోలేదు. ఎందుకంటే తుప్పరివాలన్ 2 విషయంలో తను పెట్టిన ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు. వాటి వల్ల లండన్ ప్లాట్ఫామ్స్ పై ఒంటరిగా కూర్చుని బాధపడ్డ క్షణాలు ఎప్పటికి మర్చిపోను. అతను చేసిన పనికి మార్ వ్యక్తి అయితే హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోతాడు. నేను కాబట్టి తట్టుకొని నిలబడ్డాను. ప్రస్తుతం తుప్పరివాలన్ 2 ని నేనే తెరకెక్కించాలని అనుకుంటున్నాను. నా సొంత స్క్రీన్ ప్లేతో వచ్చే ఏడాది ఈ మూవీని పట్టాలు ఎక్కిస్తాను” అంటూ వెల్లడించాడు.
ప్రస్తుతం ఈ కామెంట్స్ తమిళనాట వైరల్ గా మారాయి. ఇక ‘మార్క్ ఆంటోనీ’ విషయానికి వస్తే.. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న ఈ మూవీ రిలీజ్ కానుంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రాబోతుంది.