Trisha : త్రిషతో అంత ఈజీ కాదు.. పొలిటికల్ లీడర్‌కి లాయర్ నోటీసులు.. ఇక తగ్గేదేలే..

తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన తమిళనాడు రాజకీయ పార్టీ 'అన్నాడీఎంకే' లీడర్ ఏవి రాజుకి లాయర్ నోటీసులు పంపించిన త్రిష.

Trisha : ఈమధ్య కాలంలో సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష పేరు వివాదాలతో ఎక్కువ వినిపిస్తుంది. అయితే ఈ వివాదాల్లోకి త్రిషని ఎవరో లాగుతుంటే.. ఆమె వాటిపై ఫైట్ చేయాల్సి వస్తుంది. ఈక్రమంలోనే ఇటీవల ‘లియో’ సినిమా సమయంలో తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్.. త్రిషని ఉద్దేశిస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు పై త్రిషతో సహా ఇండస్ట్రీలోని చిరంజీవి వంటి పెద్ద స్టార్స్ కూడా రియాక్ట్ అవుతూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

తాజాగా తమిళనాడు రాజకీయ పార్టీ ‘అన్నాడీఎంకే’కి చెందిన ఏవి రాజు అనే లీడర్.. త్రిష పై అసభ్యకరంగా కామెంట్స్ చేసాడు. ఒక ప్రముఖ పొలిటికల్ లీడర్ త్రిషని డబ్బులిచ్చి రిసార్ట్‌కు పిలుపించుకున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇక ఈ కామెంట్స్ పై త్రిషతో పాటు ఆమె అభిమానులు, హీరో విశాల్ పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేసారు. త్రిష అయితే చట్టపరంగా తేల్చుకుందాం అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ట్వీట్ చేసారు.

Also read : Raviteja : ఆ విషయంలో మహేష్, బన్నీ, విజయ్ దేవరకొండ సక్సెస్.. ఇప్పుడు రవితేజ వంతు..

ట్వీట్‌లో చెప్పిన విధంగానే ఆ పొలిటికల్ లీడర్ ఏవి రాజుకి లాయర్ నోటీసులు పంపించారు. త్రిష ప్రతిష్టకు భగ్నం కలిగించేలా ఉన్న ఆ వ్యాఖ్యలు.. పేపర్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అనేకమంది ప్రజలకి చేరాయి. దీంతో త్రిష పరువుకి నష్టం వాటిలింది. కాబట్టి ఏవి రాజు పై లీగల్ గా చర్యలు తీసుకోబోతున్నట్లు త్రిష.. తన లాయర్ నోటీసులో పేర్కొన్నారు. మరి ఏవి రాజు వీటికి ఎలా బదులిస్తారో చూడాలి.

కాగా మన్సూర్ అలీఖాన్ విషయంలో కూడా త్రిష.. లీగల్ గా వెళ్లి అతడికి తగిన గుణపాఠం చెప్పారు. ఏ కారణం లేకుండా త్రిష పై అసభ్యకర కామెంట్స్ చేసినందుకు కోర్టు.. మన్సూర్ ని మందలించింది.

ట్రెండింగ్ వార్తలు