×
Ad

Flash floods : సిక్కిం వరదల్లో 14 మంది మృతి, 102 మంది గల్లంతు

సిక్కిం వరదల్లో 14 మంది మరణించగా, మరో 102 మంది గల్లంతయ్యారు. ఈ వరదల్లో 26 మంది గాయపడ్డారు. 2వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల వల్ల 11 వంతెనలు కొట్టుకుపోయాయి....

  • Published On : October 5, 2023 / 10:06 AM IST

Sikkim Flash Floods

Flash floods : సిక్కిం వరదల్లో 14 మంది మరణించగా, మరో 102 మంది గల్లంతయ్యారు. ఈ వరదల్లో 26 మంది గాయపడ్డారు. 2వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల వల్ల 11 వంతెనలు కొట్టుకుపోయాయి. 22వేల మంది వరద బారినపడ్డారని సిక్కిం అధికారులు చెప్పారు. ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నేతృత్వంలో పలు ఏజెన్సీలు ప్రభావిత ప్రాంతాల్లో శోధన కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. భారత వైమానిక దళం కూడా సిద్ధంగా ఉంది. తూర్పు సిక్కింలోని పాక్యోంగ్, హిమాలయాల దిగువన అత్యధిక మరణాలు సంభవించాయి.

Also read : ED raids : సివిక్ బాడీ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో బెంగాల్ ఆహార మంత్రి ఇంట్లో ఈడీ దాడులు

ఏడు జిల్లాలో 59 మంది గల్లంతయ్యారు. వీరిలో 23 మంది ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నారు. 3,000 మందికి పైగా పర్యాటకులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయారు. వాయువ్య సిక్కింలోని ల్హోనాక్ సరస్సుపై మేఘాలు విస్ఫోటనం చెందడంతో నీటి మట్టాలు పెరిగాయని సిక్కిం ముఖ్య కార్యదర్శి విబి పాఠక్ చెప్పారు.

Also read : Earthquake : భవిష్యత్‌లో భారీ భూకంపాల ముప్పు…ఐఐటీ భూకంప నిపుణుడి హెచ్చరిక

సరస్సు పొంగి ప్రవహించి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించే ముందు సిక్కిం, పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహించే తీస్తా నదిలో వరద నీరు ప్రవహించింది. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయారు.రాష్ట్ర అధికారులు ఆహార సరఫరా కొరత గురించి భయపడుతున్నారు.

Also read : Kerala high court : నాకు బిడ్డను కనాలని ఉందని జీవిత ఖైదీ భార్య వినతి…కేరళ హైకోర్టు సంచలన ఉత్తర్వులు