మోడీ,అమిత్ షా లు కూడా వలసవాదులే….కాంగ్రెస్

దేశమంతా ఎన్ఆర్‌సీని అమలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించడంపై లోక్‌సభ కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఈ బిల్లు తీసుకొచ్చారని, భారత్ ఏ ఒక్క మతానికో పరిమితం కాదన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సైతం వలవాదులేనని అన్నారు.

అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ…హిందుస్తాన్ అందరిదీ. ఈ దేశం ఏ ఒక్కరికో చెందింది కాదు. సర్వనదుల సమ్మేళనం ఈ ప్రాంతం. సర్వ జాతుల, మతాల ఐక్యత ఈ దేశం. గంగా, యమునా, తేహజీబ్ ఈ దేశం. ముస్లింలను లక్ష్యంగా చేసుకొనే ఎన్ఆర్‌సీ తీసుకువచ్చారు. ముస్లింలు ఈ దేశవాసులే. వాళ్లు ఈ సంస్కృతిలో భాగమే. వలసవాదం గురించి మాట్లాడితే ఈ దేశంలో చాలా మంది వలసవాదులు ఉన్నారు. ఎక్కడో గుజరాత్‌కు చెందిన మోదీ, అమిత్ షా.. ఢిల్లీలో నివసిస్తున్నారు. వాళ్లూ కూడా వలసవాదులేనని చౌదరి అన్నారు.

ట్రెండింగ్ వార్తలు