Ayodhya Ram Mandir: అయోధ్య భక్తులకు గుడ్ న్యూస్.. వారికి 10 నిమిషాల్లోనే దర్శనం.. ఇలా చేస్తే చాలు

అయోధ్యలో శ్రీరామ(Ayodhya Ram Mandir) దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది.

Ayodhya ram mandir introduces sugam darshan pass for senior citizens and mothers

  • పది నిమిషాల్లోనే సుగమ దర్శనం
  • ఆధార్ కార్డు చూపిస్తే పాస్
  • చిన్న పిల్లల తల్లులకు ఊరట

Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యలో శ్రీరామ నవమి సహా నిత్యం దర్శనానికి వచ్చే లక్షలాది మంది రామభక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీరామ (Ayodhya Ram Mandir)జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఒక అత్యంత కీలకమైన, ప్రతిష్టాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఆలయానికి వచ్చే వయోవృద్ధులు, పసిపిల్లలతో వచ్చే తల్లులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా అత్యంత సౌకర్యవంతంగా, త్వరగా స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకునేలా ప్రత్యేక ‘సుగమ దర్శన’ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. భక్తుల సౌకర్యార్థం తీర్చిదిద్దిన ఈ నూతన ఏర్పాట్లు ఇప్పుడు సర్వత్రా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

Mohan Bhagwat: నిరసన తెలిపితే దేశద్రోహులా.. యువతే దేశ భవిష్యత్తు.. జెన్ జీపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు!

70 ఏళ్లు దాటిన వారికి ఆధార్ చూపిస్తే చాలు:

నూతన నిబంధనల ప్రకారం 70 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వయోవృద్ధులు ఇకపై ఎలాంటి ముందస్తు ఆన్‌లైన్ అనుమతులు లేదా బుకింగ్‌లు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక ‘సుగమ దర్శనం’ కౌంటర్‌లో ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ లేదా ప్రభుత్వం గుర్తించిన ఏదైనా గుర్తింపు కార్డును చూపిస్తే కేవలం 10 నిమిషాల్లోనే పాస్ జారీ చేస్తారు. అలాగే వృద్ధుల సహాయార్థం ఒక తోడు సహాయకుడికి కూడా ఈ పాస్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.

మూడేళ్లలోపు చిన్నారుల తల్లులకు నేరుగా పాస్:

వయోవృద్ధులతో పాటు మూడేళ్లలోపు చిన్న పిల్లలతో వచ్చే తల్లులకు కూడా ఆలయ ట్రస్ట్ భారీ ఉపశమనం కల్పించింది. చిన్న పిల్లలతో గంటల తరబడి సాధారణ క్యూలైన్లలో వేచి ఉండడం కష్టంతో కూడుకున్న పని కావడంతో, వారు కూడా నేరుగా సుగమ దర్శనం కౌంటర్ వద్ద పాస్ తీసుకుని స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ నూతన ప్రక్రియ ద్వారా గంటల కొద్దీ వేచి ఉండే సమయం ఆదా అవ్వడంతో పాటు భక్తుల ప్రయాణం మరింత సుఖమయం కానుంది.