BJP workers thrash youth : ప్రధాని నరేంద్ర మోదీని దూషించినందుకు ఓ యువకుడిపై దాడి జరిగింది. జార్ఖండ్లోని ధన్బాద్లో ముస్లిం యువకుడు మోదీని దుర్భాషలాడాని ఆరోపిస్తూ బీజేపీ కార్యర్తలు దాడికి దిగారు. అతడితో గుంజీలు తీయించి రోడ్డుపై ఉమ్మి నాకించారు. మోకాళ్లపై కూర్చొబెట్టి జైశ్రీరామ్ అనాలని ఒత్తిడి చేశారు. బీజేపీ ఎంపీ పీఎన్ సింగ్, ఎమ్మెల్యే రాజ్ సిన్హా సహా ఇతర నేతల సమక్షంలో పార్టీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా భద్రతా వైఫల్యాలను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తునా ధర్నా నిర్వహించారు. జార్ఖండ్ లోని ధన్బాద్ దగ్గర గాంధీ చౌక్లో నిరసనలు వ్యక్తం చేశారు. ఈ ధర్నాలకు ఎమ్మెల్యే రాజ్ సిన్హా నేతృత్వం వహించారు. ధర్నాలు నిర్వహిస్తున్న సమయంలో ఆ యువకుడు ప్రధాని మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పట్ల దుర్భాషలాడాడని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. అతనిపై దాడికి దిగారు. తనను విడిచిపెట్టాలని బాధితుడు చేతులెత్తి దండం పెట్టాడు.
.@dc_dhanbad कृपया उक्त मामले की जाँच कर दोषियों पर सख्त कार्यवाई करते हुए सूचित करें।
अमन चैन से रहने वाले झारखण्डवासियों के इस राज्य में वैमनस्य की कोई जगह नहीं है।@dhanbadpolice @JharkhandPolice https://t.co/XXZFcu9mNo— Hemant Soren (@HemantSorenJMM) January 7, 2022
అతన్ని మోకాళ్లపై కూర్చోబెట్టారు.. గుంజీలు తీయించి రోడ్డుపై ఉమ్మి నాకించారు. ఇదంతా చూసినా అక్కడి పోలీసులు బాధితుడ్ని రక్షించేందుకు ముందుకు రాలేదు. ఈ ఘటనపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పందించారు. బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. బాధితునికి న్యాయం జరిగేలా చూస్తామని సీఎం స్పష్టం చేశారు.
Read Also : Corona Vaccination: కరోనా ప్రికాషన్ డోస్ అపాయింట్మెంట్లు ప్రారంభం