Ganesh idol : హుబ్బళ్లి ఈద్గా మైదానంలో గణేష్ విగ్రహం ఏర్పాటుకు మున్సిపల్ అనుమతి
కర్ణాటక రాష్ట్రంలో వినాయక ఉత్సవాల సందర్భంగా మళ్లీ వివాదం రాజుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని హుబ్బళ్లి నగరంలోని ఈద్గా మైదానంలో గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపనకు మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి మంజూరు చేసింది....
- saleem sk
- Published On : September 16, 2023 / 10:54 AM IST
Ganesh idol
Ganesh idol : కర్ణాటక రాష్ట్రంలో వినాయక ఉత్సవాల సందర్భంగా మళ్లీ వివాదం రాజుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని హుబ్బళ్లి నగరంలోని ఈద్గా మైదానంలో గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపనకు మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి మంజూరు చేసింది. గణేష్ చతుర్థి వేడుకలను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను కర్ణాటక హైకోర్టులోని ధార్వాడ్ బెంచ్ కొట్టివేసిన నేపథ్యంలో వివాదాస్పద ఈద్గా మైదానంలో గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపనకు హుబ్బళ్లి-ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతినిచ్చింది. (Civic body permits installation of Ganesh idol) హైకోర్టు ఆదేశాల మేరకే గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపనకు అనుమతులు మంజూరు చేసినట్లు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఈశ్వర్ ఉల్లగడ్డి తెలిపారు. (Idgah Maidan in Hubballi)
Hyderabad : మహిళా ఐఏఎస్ అధికారికి వేధింపులు .. ఇంటికి వచ్చి హల్ చల్
హైకోర్టు ఆదేశాలతో మున్సిపాలిటీ తీర్మానం మేరకు మూడు రోజుల పాటు ఈద్గా మైదాన్లో గణేశ ఉత్సవాలు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చామని హుబ్బళ్లి-ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తెలిపారు. కర్ణాటకలోని హుబ్బళ్లిలోని ఈద్గా మైదాన్లో గణేష్ చతుర్థి వేడుకలను నిలిపివేయాలని కోరుతూ అంజుమన్-ఏ-ఇస్లాం దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు ధార్వాడ్ బెంచ్ కొట్టివేసింది. 1992లో గణతంత్ర దినోత్సవం రోజున భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) నాయకుల బృందం ఈద్గా మైదాన్లో జెండాను ఎగురవేయడానికి ప్రయత్నించింది.
అయితే అంజుమన్-ఎ-ఇస్లాం 1921 నాటి ఒప్పందాన్ని ఉటంకిస్తూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి నిరాకరించింది. ఈ ఒప్పందంలో మున్సిపాలిటీ భూమిని 999 సంవత్సరాల పాటు ప్రార్థనల కోసం ఉపయోగించాలని 1921వ సంవత్సరంలో అభ్యర్థించిన అంజుమన్-ఇ-ఇస్లాం అనే ముస్లిం సంస్థకు భూమిని లీజుకు ఇవ్వడానికి అనుమతిని మంజూరు చేసింది. దీంతో హుబ్బళ్లిలో నిరసనలు వెల్లువెత్తాయి. వివాదాస్పద స్థలంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు అధికార కాంగ్రెస్ 1992వ సంవత్సరంలో అనుమతి నిరాకరించింది.
Odisha : ఒడిశాలో దారుణం..భార్యను చంపి, ముక్కలు చేసి…
మరో ప్రయత్నంగా 1994వ సంవత్సరంలో బీజేపీ నాయకురాలు ఉమాభారతి హుబ్బళ్లిలోని ఈద్గా మైదాన్లో జాతీయ జెండాను ఎగురవేస్తానని ప్రకటించారు. మతపరమైన అల్లర్లకు భయపడి, కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ కర్ఫ్యూ విధించింది. దీంతో హుబ్బళ్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఉమాభారతిని జెండా ఎగురవేయకుండా అడ్డుకోవడంతో ఘర్షణలు జరిగి ఆరుగురు మృతి చెందారు.
Nipah virus : కరోనా కంటే నిపా వైరస్ మరణాల రేటు అధికం…ఐసీఎంఆర్ హెచ్చరిక
2010లో సుప్రీం కోర్టు మరియు కర్ణాటక హైకోర్టు రెండు సంవత్సరాల న్యాయ వాదాల తర్వాత ఈద్గా మైదాన్ హుబ్బళ్లి-ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందినదని నిర్ధారించాయి. ఈద్గా భూమిలో బక్రీద్, రంజాన్ సమయంలో ప్రార్థనలకు మాత్రమే అనుమతి ఉందని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది
