Odisha : ఒడిశాలో దారుణం..భార్యను చంపి, ముక్కలు చేసి…

ఒడిశా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఢిల్లీ తరహా ఘటన ఒడిశాలో తాజాగా జరిగింది. ఒడిశాలోని గంజాం జిల్లాలోని రుషికుల్య నదిలో 28 ఏళ్ల కార్మికుడు తన 22 ఏళ్ల భార్య గొంతు కోసి చంపి,ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఆపై ఆ మృతదేహం ముక్కలను నదిలో పడేశాడు.....

Odisha : ఒడిశాలో దారుణం..భార్యను చంపి, ముక్కలు చేసి…

police

Odisha : ఒడిశా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఢిల్లీ తరహా ఘటన ఒడిశాలో తాజాగా జరిగింది. ఒడిశాలోని గంజాం జిల్లాలోని రుషికుల్య నదిలో 28 ఏళ్ల కార్మికుడు తన 22 ఏళ్ల భార్య గొంతు కోసి చంపి,ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఆపై ఆ మృతదేహం ముక్కలను నదిలో పడేశాడు. ఈ ఘటన సొరాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగబన్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

Nipah virus : కరోనా కంటే నిపా వైరస్ మరణాల రేటు అధికం…ఐసీఎంఆర్ హెచ్చరిక

అత్త ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. (Body Dumps It In River) భార్యతో జరిగిన వాగ్వాదంతో నిందితుడు తన భార్యను గొంతు కోసి చంపి, గొడ్డలితో మృతదేహాన్ని ఐదు ముక్కలు చేశాడు. అనంతరం ఆ ముక్కలను నదిలో విసిరేశాడని పోలీసులు చెప్పారు. ఆభరణాలు ఇవ్వాలని భర్త కోరగా ఆమె నిరాకరించడంతో ఆమెను దారుణంగా హతమార్చాడని పోలీసులు చెప్పారు. నిందితుడు తన భార్య బంగారు ఆభరణాలను విక్రయించి వ్యాపారం ప్రారంభించాలని యోచిస్తున్నాడని ఒడిశా పోలీసులు తెలిపారు.

ED Raids : అక్రమ ఇసుక మైనింగ్ కేసులో ఈడీ దాడులు

వీరికి మూడు నెలల క్రితమే ఓ దేవాలయంలో వివాహం జరిగింది. ఘటన జరిగిన ఒకరోజు తర్వాత తన భార్య కనిపించడం లేదని అత్తమామలకు తెలిపాడు. నిందితుడిని శుక్రవారం విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది నదిలో శరీర భాగాల కోసం వెతికినా నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో శరీర భాగాలు దొరకలేదని పోలీసులు చెప్పారు. నిందితుడు నేరం చేసినట్లు అంగీకరించాడని, అయితే శరీర భాగాలను స్వాధీనం చేసుకోవడానికి యత్నిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.