బిగ్ స్కామ్: ఇండియాలో అతిపెద్ద స్కామ్

  • Publish Date - January 30, 2019 / 01:27 AM IST

ఢిల్లీ : దేశంలో మరో అతిపెద్ద స్కామ్‌ వెలుగు చూసింది. మాల్యా, మోదీ, చోక్సీ స్కామ్‌లు దాని ముందు దిగదుడుపేనంటోది కోబ్రాపోస్ట్. వివిధ షెల్ కంపెనీల సాయంతో డీహెచ్ఎఫ్ఎల్ నిధులను విదేశాలకు మళ్లించిందని ఆరోపిస్తోంది. ఈ మొత్తం స్కామ్ విలువ 31వేల కోట్లకుపై మాటే అంటోంది. 
శ్రీలంక, దుబాయ్, యూకే, మారిషస్ దేశాల్లో ఆస్తులు

షెల్ కంపెనీలతో డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లకు సంబంధాలు
మురికివాడల అభివృద్ధి పేరుతో రుణాలు, గ్రాంట్లు
షెల్ కంపెనీలోకి రూ.21,477కోట్లు చేరాయని ఆరోపణ
2015-2018లో 32బ్యాంకుల నుంచి రుణాలు 
డిక్లరేషన్ లేకుండానే లోన్లుగా తీసుకున్న ప్రమోటర్స్
ఎస్‌బీఐ నుంచి రూ.11,500 కోట్లు
15 బ్యాంకుల నుంచి రూ.1500 కోట్ల రుణం

దేశాన్ని మరో అతిపెద్ద పైనాన్షియల్ స్కాం కలవరపెడుతోంది. దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటిడెట్ డీహెచ్ఎఫ్ఎల్‌లో 31వేల 500 కోట్ల రూపాయల స్కాం జరిగినట్లు ఆన్‌లైన్ పోర్టల్ కోబ్రా పోస్ట్ ఆరోపించింది. డీహెచ్ఎఫ్ఎల్‌ ప్రమోటర్లు, వారికి చెందిన షెల్ కంపెనీలకు ఎలాంటి సెక్యూరిటీస్ లేకుండానే భారీగా నిధులు మళ్లించినట్లు కోబ్రా పోస్ట్ తెలిపింది..
ఒకే అడ్రస్‌తో ఉన్న కంపెనీలు.. అసలు ఊరూపేరూ లేని 45 డొల్ల కంపెనీలకు కూడా రుణాలు ఇచ్చినట్లు పేర్కొంది. ఆ నిధులన్నీ విదేశాలకు వెళ్లిపోయాయని ఆరోపించింది. అవే నిధులతో భారత్‌లో షేర్లు, ఇతర ప్రైవేట్ ఆస్తుల కొనుగోలు చేశారని పేర్కొంది. భారత్‌తోపాటు శ్రీలంక, దుబాయ్, యూకే, మారిషస్ వంటి పలు దేశాల్లో కూడా ఆస్తులు పోగేసుకోవడంతో పాటు.. జల్సాలు చేసుకున్నారని కోబ్రాపోస్ట్ పేర్కొంది. షెల్ కంపెనీలు, కొనుగోలు చేసిన ఆస్తులతో డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లకు సంబంధముందని ఆరోపించింది. 

మురికివాడల అభివృద్ధి పేరుతో… రుణాలు, గ్రాంట్లు సేకరించి భారీ మోసానికి పాల్పడడ్డారని తెలిపింది. అంతే కాకుండా… కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే… 21వేల 477కోట్ల రూపాయలు షెల్ కంపెనీలోకి చేరాయని ఆరోపించింది. 2015-2018 మధ్య కాలంలో 32 బ్యాంకుల నుంచి రుణాలు సేకరించినట్లు కథనాన్ని ప్రచురించింది. కంపెనీ ప్రమోటర్స్…ఎలాంటి డిక్లరేషన్ లేకుండానే లోన్లుగా తీసుకుని షెల్ కంపెనీలకు మళ్లించారని ఆరోపించింది. ఒక్క ఎస్‌బీఐ నుంచే సుమారు 11వేల 500 కోట్ల రూపాయలు తీసుకున్నారని, 15 బ్యాంకుల నుంచి 15వందల కోట్ల చొప్పున తీసుకున్నట్లు కోబ్రా పోస్ట్ ఆధారాలు చూపింది. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసంగా ప్రకటించింది.