ముంబై : డ్రైనేజీ శుభ్రం చేస్తున్న సమయంలో విషవాయువులు పలువురు ప్రాణాలను తీస్తున్నాయి. డ్రైనేజీలో క్లీన్ చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటువంటి మరోప్రమాదానికి ముగ్గురు యువకులు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్ర థానేలోని ధోకాలి ప్రాంతంలో శుక్రవారం (మే 10,2019) తెల్లవారుజామున 12:25 గంటలకు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్ని చేపట్టారు. అస్వస్థతకు గురైనవారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.
డ్రైనేజీని శుభ్రం చేసేందుకు 8 మంది వ్యక్తులు మురుగును శుద్ధి చేసే ప్లాంట్లోకి దిగారు. 130 క్యూబిక్ మీటర్ల లోతు ఉన్న ఈ ప్లాంట్లో విషయవాయులకు ఊపిరాడక ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాగా మృతులను అమిత్ ఫుహల్(20), అమన్ బాదల్(21), అజయ్ బంబుక్(24)గా గుర్తించారు. అస్వస్థతకు గురైన వారిని విజేంద్ర హత్వల్, మంజిత్, జస్బీర్ పుహల్, అజయ్ పుహల్, రమ్మర్ పుహల్ గా పోలీసులు గుర్తించారు.
Thane West: 8 people got stuck in a 130 cubic meter deep Sewage Treatment Plant at Pride Presidency Luxuria in Dhokali around 12:25 am today. 3 of them died in the incident, rest 5 were rescued. Bodies handed over to police. #Maharashtra pic.twitter.com/XqzFGKw3cb
— ANI (@ANI) May 10, 2019