×
Ad

Earthquake : లద్దాఖ్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్ర 4.4 గా నమోదు

లద్దాఖ్ లోని కార్గిల్‌కు ఉత్తర-వాయువ్యంగా 314 కి.మీ దూరంలో భూకంప సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది.

  • Published On : November 15, 2023 / 09:01 AM IST

Earthquake strickes Ladakh

Earthquake Strickes Ladakh : లద్దాఖ్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 4.4గా నమోదు అయింది. మధ్యాహ్నం 1:08 గంటలకు ఈ ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం 20 కిలో మీటర్ల లోతుతో ఉంది. లద్దాఖ్ లోని కార్గిల్‌కు ఉత్తర-వాయువ్యంగా 314 కి.మీ దూరంలో భూకంప సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది.

4.4 తీవ్రత భూకంపం సంభవించినట్లు ట్విట్టర్ లో నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పోస్ట్‌ చేసింది. భూమికి 20 కి.మీ లోతులో భూపంక కేంద్రం కేంద్రీకృతమైనట్లు తెలిపింద. లద్దాఖ్ లోని కార్గిల్ ఉత్తర -వాయువ్యంగా 314 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు పేర్కొంది.

IMD Issues Warning : బంగాళాఖాతంలో అల్పపీడనం…ఆంధ్రా మత్స్యకారులకు ఐఎండీ హెచ్చరిక

మంగళవారం శ్రీలంకలోని కొలంబోలో రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 12.31 గంటలకు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలో మీటర్ల లోతుతో ఉంది. కొలంబోకు ఆగ్నేయంగా 1326 కి.మీ దూరంలో భూకంప సంభవించింది.

రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైందని ట్విట్టర్ పోస్ట్‌లో నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. కొలంబోకు 1326కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు తెలిపింది.