Encounter In Chhattisgarh : ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్..పలువురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ జరిగింది. పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. సుక్మా బిగ్ లో పోలీసులు-మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది.
- bheemraj
- Published On : November 26, 2021 / 09:35 PM IST
Encounter (2)
Maoists kills in Encounter : ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ జరిగింది. పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. సుక్మా బిగ్ లో పోలీసులు-మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఒక మావోయిస్టు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాడమెట్ల అడవిలో ఎన్కౌంటర్ జరిగింది. కాల్పులు, కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది. చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు అయింది. కోబ్రా 201, DRG బృందం ఎన్కౌంటర్ లో పాల్గొంది.
Sridhar Rao : సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుకు మళ్లీ నోటీసులు
పార్టీ చింతల్నార్ నుండి తిరిగి వచ్చే సమయంలో ఎన్కౌంటర్ జరిగింది. చాలా మంది మావోయిస్టులు మృతి చెందటంతో పాటు పలువురు గాయపడిన్నట్లు సమాచారం. కాల్పులను సుక్మా ఎస్పీ సునీల్ శర్మ ధృవీకరించారు.
