Electricity : వేసవిలో కరెంట్ కష్టాలు తప్పవా?
బొగ్గు ఉత్పత్తి పడిపోతే విద్యుత్ సహ ఇతర ఆధారిత రంగాలలో సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రపంచంలోని అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారుగా కోల్ ఇండియా ఉంది.
- bheemraj
- Published On : February 19, 2022 / 09:59 AM IST
Corrent
electricity difficulties : వేసవి కాలం దగ్గరపడుతోంది. ఉక్కపోత, ఎండతో జనం సతమతమవుతారు. ఈసారి వీటికి తోడు పవర్ కష్టాలు వెంటాడేలా ఉన్నాయి. బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో విద్యుత్ రంగానికి కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ధరలు పెంచలేకపోతే బొగ్గు ఉత్పత్తి పడిపోవచ్చని ప్రభుత్వ రంగ మైనర్ కోల్ ఇండియా లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
బొగ్గు ఉత్పత్తి పడిపోతే విద్యుత్ సహ ఇతర ఆధారిత రంగాలలో సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రపంచంలోని అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారుగా కోల్ ఇండియా ఉంది. అయితే జీతాలు పెరగడం, డీజిల్ అధిక ధరలతో సంస్థ ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. అయితే దీనికి తగ్గట్టు ధరలు పెంచకపోతే కంపెనీలోని కొన్ని యూనిట్లు నడపడం భారం కానుందని సంస్థ ఛైర్మన్ తెలిపారు.
Smart Power Substations : విశాఖపట్నం జిల్లాలో స్మార్ట్ విద్యుత్ సబ్ స్టేషన్లు
కోల్ ఇండియా బొగ్గు ధరలను పెంచడానికి ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. దేశంలో కరెంట్ ధరలు పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన 70 శాతం బొగ్గును కోల్ ఇండియా ఉత్పత్తి చేస్తుంది. గత ఏడాది బొగ్గు ఉత్పత్తి పడిపోవడంతో విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు పడిపోయాయి.
దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వేసవి సమీపిస్తున్న కొద్దీ దేశంలో విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ పెరుగుతోంది. ఈ సమయంలో కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తి నిలిపివేస్తామని హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది.
