AI tools: కేంద్రం సంచలనం.. ఈ జాబ్స్ చేసేవాళ్లు చాట్ జీపీటీ, డీప్‌సీక్ వాడొద్దని ఆర్డర్స్

కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అడ్వైజరీని ఎందుకు జారీ చేసింది?

AI tools

ప్రస్తుత కాలంలో చాట్‌జీపీటీ, జెమిని వంటి ఏఐ చాట్‌బాట్‌ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో కాకుండా నేరుగా చాట్‌జీపీటీ, జెమిని వంటి ఏఐ చాట్‌బాట్‌ల నుంచే తమకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకుంటున్న వారు భారీగా పెరిగిపోయారు.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తమ ఉద్యోగులను అధికారిక పనుల్లో చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌ వంటే ఏఐ టూల్స్‌ను వాడొద్దని చెప్పింది. ప్రభుత్వ పత్రాలు, డేటా గోప్యతకు సంబంధించిన రిస్కులు ఉండడంతో ఈ సూచన చేసింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలు కూడా ఇటువంటి నిబంధనలే అమలు చేస్తున్నాయి. ఏఐ వల్ల డేటా భద్రతకు ముప్పు పొంచి ఉంటుందని భావిస్తున్నాయి.

iPhone 16 Pro: అదిరిపోయే ఆఫర్.. అతి తక్కువ ధరకే ఆపిల్‌ ఐఫోన్‌ 16ప్రో

ఓపెన్‌ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సామ్ ఆల్ట్‌మన్ ఇవాళ భారత ఐటీ మంత్రి అశ్విని వైష్ణవంతో బుధవారం సమావేశమయ్యారు. ఏఐకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఇటువంటి సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తమ ఉద్యోగులకు ఏఐపై చేసిన అడ్వైజరీ సామాజిక మాధ్యమాల్లోనూ కనపడింది.

“ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ఇతర డివైజ్‌లలో చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌ వంటి ఏఐ టూల్స్‌, ఏఐ యాప్‌లు ఉంటే అవి డేటా, పత్రాల గోప్యత విషయంలో నష్టాలకు కలిగించే అవకాశం ఉంది” అని ఆ అడ్వైజరీలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో పాటు చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ఏఐ, అలాగే డీప్‌సీక్ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే, ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన అడ్వైజరీ నిజమైందేనని, ఈ నోట్‌ను అంతర్గతంగా జారీ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ముగ్గురు అధికారులు తెలిపారు.