×
Ad

Vrindavan : బృందావన్ ఆలయ సమీపంలో భవనం కూలి ఐదుగురి మృతి

ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లోని ఆలయ సమీపంలో భవనం బాల్కనీ కుప్పకూలడంతో ఐదుగురు మరణించారు. బృందావన్‌లోని బాంకే బిహారీ ఆలయానికి వెళ్లే రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది....

  • Published On : August 16, 2023 / 05:57 AM IST

building collapses

Vrindavan : ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లోని ఆలయ సమీపంలో భవనం బాల్కనీ కుప్పకూలడంతో ఐదుగురు మరణించారు. బృందావన్‌లోని బాంకే బిహారీ ఆలయానికి వెళ్లే రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజీలో భవనంలోని కొంత భాగం ప్రజలపై పడిపోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం నెలకొంది. (UP’s Vrindavan) శిథిలాల నుంచి ప్రజలను రక్షించడానికి జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. (building collapses near temple)

Rishabh Pant : ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. పంత్ రీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌..?

ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది గాయపడ్డారని మధుర అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. రద్దీగా ఉన్న ఆలయ మార్గంలో భవనం బాల్కనీ కూలిపోవడంతో అది ప్రజలపై పడింది. పురాతన భవనం కావడంతో కూలిందని మున్సిపల్ అధికారులు చెప్పారు.