Gold Price Today
Gold Price Today : కాలంతో పని లేదు. పండుగలతో నిమిత్తం లేదు. సీజన్ ఏదైనా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పసిడి ధరలు చుక్కలను తాకుతాయి. కాగా, పసిడి ధరల్లో రోజురోజుకు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతాయి. తాజాగా బంగారం ధర పెరిగింది.
దేశంలో బంగారం, వెండి ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.264 పెరిగి రూ.45వేల 123కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.44వేల 859 దగ్గర ముగిసింది.
Gold : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.100 కే గోల్డ్..!
ఇక వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.362 పెరిగి రూ.58వేల 825కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర 58వేల 463 దగ్గర ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,739 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 22.26 అమెరికన్ డాలర్లు పలికింది.
అంతర్జాతీయంగా విలువైన లోహాల ధర స్వల్పంగా పెరగడం, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ స్వల్పంగా తగ్గడం.. దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. పుత్తడిని కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇక భారతీయులకు అత్యంత ఇష్టమైనది బంగారం. మహిళలు బంగారానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తారు. ధర ఎంత పెరిగినా భారతీయులు బంగారం కొనుగోళ్లు మాత్రం ఆపరు.
బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల దగ్గరున్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.