Gold : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.100 కే గోల్డ్..!
అసలే బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రూ.100కే గోల్డ్ అమ్ముతారంటే నమ్మడం కొంచెం కష్టమే. కానీ, ఇది నిజమే. రూ.100కే బంగారం అమ్మేందుకు జువెలరీ కంపెనీలు..
Gold For Rs 100 : భారతీయులకు బంగారం అంటే ఎంతో మక్కువ. మరీ ముఖ్యంగా మగువలకు. గోల్డ్ అంటే ప్రాణం. అకేషన్ ఏదైనా వచ్చిందంటే చాలు పసిడి కొనేందుకు రెడీ అయిపోతారు. ఇక పెళ్లిళ్లు, పండుగలు వచ్చాయంటే కచ్చితంగా గోల్డ్ కొనాల్సిందే. ఇలా పుత్తడితో భారతీయులకు విడదీయలేని బంధం ఉంది. బంగారం మీద భారతీయులకు ఉన్న ఈ మోజుని క్యాష్ చేసుకునేందుకు జువెలరీ కంపెనీలు ప్లాన్ చేశాయి. జువెలరీ కంపెనీలు మరో అడుగు ముందుకేశాయి. గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పాయి. రూ.100కే బంగారం అందించే ప్లాన్స్ తో జువెలరీ కంపెనీలు ముందుకొస్తున్నాయి.
అసలే బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రూ.100కే గోల్డ్ అమ్ముతారంటే నమ్మడం కొంచెం కష్టమే. కానీ, ఇది నిజమే. రూ.100కే బంగారం అమ్మేందుకు జువెలరీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అదీ ఆన్లైన్ అమ్మకాల ద్వారా.
Lukewarm Water : పరగడుపున గోరు వెచ్చని నీళ్ళు తాగితే ప్రయోజనాలు ఎన్నంటే?
100 రూపాయలకే బంగారం..!
తాజాగా టాటా గ్రూప్కు చెందిన తనిష్క్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా లిమిటెడ్, పీసీ జ్యువెలర్ లిమిటెడ్, సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి గోల్డ్ జువెలరీ కంపెనీలు కనిష్టంగా రూ. 100 కూడా బంగారం అందించే ప్లాన్స్తో ముందుకొస్తున్నాయి. కంపెనీ వెబ్సైట్లలో లేదా ఇతర థర్డ్యాప్స్ ద్వారా విక్రయించే ఆఫర్లను ప్రారంభించాయి. కాగా ఒక గ్రామ్ బంగారం కొనుగోలు చేసిన వారికే మాత్రమే గోల్డ్ జువెలరీ కంపెనీలు డెలివరీ చేయనున్నాయి.
Gerbera Farming: ఒక్కసారి నాటితే మూడేళ్ల వరకూ ఆదాయం.. జెర్బరా ప్రత్యేకత అదే
డిజిటల్ బంగారం అమ్మకాలు భారత్కు కొత్తేమీ కాదు… పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి మొబైల్ వ్యాలెట్స్ డిజిటల్ బంగారాన్ని అందిస్తున్నాయి. ఆగ్మాంట్ గోల్డ్ ఫర్ ఆల్ వంటి ప్లాట్ఫామ్ లు, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్-ఆధారిత సేఫ్ గోల్డ్ ఆయా మొబైల్ వ్యాలెట్లకు ఉత్పత్తి చేస్తున్నాయి. ఆన్లైన్లో నగలను విక్రయించే సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆగ్మాంట్ గోల్ట్ డైరక్టర్ కేతన్ కొఠారి తెలిపారు.
దసరా, ధంతేరాస్, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఈ సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్తో బంగారం అమ్మకాలను మరింత పెంచుకోవడానికి జువెలరీ కంపెనీలు సిద్దమయ్యాయి. గతేడాది ఫిబ్రవరి తర్వాత ఆన్లైన్లో విక్రయాలు 200 శాతం పెరిగినట్లు గోల్డ్ జువెలరీ వర్గాలు తెలిపాయి. ఎక్కువగా 3 వేల నుంచి 4 వేల మధ్య ఉండే నాణేలు, బిస్కట్లపై కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు.
కోవిడ్.. జువెలర్స్ మైండ్ సెట్ మార్చేసింది. ఆన్ లైన్ అమ్మకాలవైపుగా దృష్టి పెట్టేలా చేసింది అని అగ్మాంట్ గోల్డ్ డైరెక్టర్ కేతన్ చెప్పారు. అగ్మాంట్ గోల్డ్ కి 4వేలకిపై జులెవర్ పార్టనర్స్ ఉన్నారు.
దేశంలో పండుగల సీజన్ రానుంది. దీంతో కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు జులెవరీ కంపెనీలు పలు ఆఫర్లు ప్రకటించాయి. ఇక దేశంలో బంగారం డిజిటల్ కొనుగోళ్లు బాగా పెరిగాయి. ముఖ్యంగా యంగస్టర్లు ఎక్కువగా ఆన్ లైన్ లో బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారని కళ్యాణ్ జువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణ్ రామన్ అన్నారు.
ఆభరణాల వెబ్సైట్లలో ఆభరణాల విక్రయం సహా ఆన్లైన్ బంగారం కొనుగోళ్లు 2019 లో మొత్తం అమ్మకపు విలువలో కేవలం 2% మాత్రమే ఉండగా, ఈ లావాదేవీలలో ఎక్కువ భాగం 45 ఏళ్లలోపు వ్యక్తులు చేసినట్లు గతేడాది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక చెబుతోంది.