Only Vaccinated People : వ్యాక్సిన్ తీసుకోనివారికి బహిరంగ ప్రదేశాల్లోకి నో ఎంట్రీ

దేశానికి కరోనా మూడో ముప్పు పొంచి ఉందని అధ్యయనాలు వెలువడుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారి విషయంలో పలు రాష్ట్రాలు కఠిన

Anil

Only Vaccinated People :  దేశానికి కరోనా మూడో ముప్పు పొంచి ఉందని అధ్యయనాలు వెలువడుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారి విషయంలో పలు రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా హర్యానా ప్రభుత్వం.. జనవరి-1,2022 నుంచి రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోని వారు బహిరంగ ప్రదేశాల్లో తిరగటంపై నిషేధం విధించింది.

కళ్యాణ మండపాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు లేదా మరే ఇతర బహిరంగ ప్రదేశాల్లోకి వ్యాక్సిన్ తీసుకోని వారికి అనుమతి ఉండబోదని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ బుధవారం​ తెలిపారు. ఒమిక్రాన్, కరోనా మూడవ వేవ్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికే ఈ నిబంధన అని చెప్పారు. హర్యాణాలో ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూడలేదు. అయినప్పటికీ ప్రభుత్వం కఠిన నిబంధనలు విధిస్తోంది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 3 కోట్ల 11 లక్షల టీకా డోసులు పంపిణీ జరిగింది.

మరోవైపు,వ్యాక్సిన్ తీసుకోని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించబోమని పంజాబ్ ప్రభుత్వం బుధవారం స్పష్టం చేసింది.

ALSO READ Women CRPF Personnel : సోనియా,ప్రియాంక భద్రతకు సీఆర్​పీఎఫ్ మహిళా కమాండోలు