If Kids Can Go To School At 7am Sc Can Start At 9am Justice Lalit
Justice Lalit : కోర్టు ప్రారంభించే సమయం విషయంలో కొత్త సంప్రదాయానికి తెరదీసారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత్. ఈ సందర్భంగా జస్టిస్ లలిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిల్లలు 7గంటలకే స్కూలుకు వెళుతున్నప్పుడు న్యాయమూర్తులు,న్యాయవాదులు కోర్టు 9 గంటలకే ఎందుకు ప్రారంభం కాకూడదు? అని అన్నారు. కోర్టులు ప్రస్తుతం ప్రారంభించే సమయకంటే ముందుగానే ప్రారంభమవ్వాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయం కూడా అని అన్నారు.
సాధారణంగా సుప్రీంకోర్టులో ప్రతి రోజు ఉదయం 10.30 గంటలకు కార్యకలాపాలు ప్రారంభమై..సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి. మధ్యలో 1-2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో ఉన్న ఈ సమయ పాలనకు భిన్నంగా జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ సుదాన్షు ధూలియా కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం (15,2022)ఉదయం 9.30 గంటలకు విచారణలు ప్రారంభించింది.
ఓ కేసు విషయంలో బెయిల్ ఇచ్చే విచారణలో వాదలను వినిపించడానికి వచ్చిన మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి, ధర్మాసనం రోజు కంటే ముందుగానే విచారణలు ప్రారంభించడాన్ని ప్రశంసించారు. ‘‘9.30 గంటలకు అన్నది కోర్టుల ప్రారంభానికి సరైన సమయం అన్నది నా అభిప్రాయం’’ అని రోహత్గి తెలిపారు.
దీనికి జస్టిస్ లలిత్ స్పందిస్తూ.. కోర్టులు ముందుగానే ప్రారంభమవ్వాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయం అని వివరించారు. ‘‘ఉదయం 9 గంటలకు విచారణ మొదలు పెట్టడం చక్కగా ఉంటుంది. మన పిల్లలు ఉదయం 7 గంటలకే స్కూలుకు వెళుతున్నప్పుడు, మనం 9 గంటలకు కోర్టును ఎందుకు ప్రారంభించకూడదు? అని నేను తరచుగా చెబుతూనే ఉన్నాను’’ అంటూ ఆసక్తికరమైన అంశాన్ని వివరించారాయన.
కాగా..వచ్చే ఆగస్టు 27న భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి పదవిని జస్టిస్ లలిత్ అలంకరించనున్నారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. నవంబర్ 8 వరకు ఆయన ఆ హోదాలో ఉండనున్నారు. ఈక్రమంలోనే జస్టిస్ లలిత్ ఇటువంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేయటమే కాకుండా కోర్టును 9 గంటలకే ప్రారంభించటం గమనించాల్సిన విషయం. ఇదే కొనసాగించనున్నారో లేదో తెలియాలి. జస్టిస్ లలిత్ అభిప్రాయం ప్రకారం..సుప్రీంకోర్టు బెంచ్లు ఉదయం 9 గంటలకు సమావేశమై 11.30 గంటలకు 30 నిమిషాల విరామం తీసుకోవాలి. “మళ్లీ 12కి ప్రారంభించి, 2కి ముగించాలి.