Coronavirus India: దేశంలో తగ్గిన కేసులు.. తగ్గని మరణాలు
దేశంలో రోజువారీ కరోనావైరస్ సోకినవారి సంఖ్య 71 రోజుల తరువాత చాలా తక్కువగా నమోదైంది. ఆరోగ్య మంత్రిత్వశాఖ లేటెస్ట్ లెక్కల ప్రకారం, గత 24గంటల్లో కొత్తగా 80,834 కొత్త కరోనా కేసులు వచ్చాయి. 3వేల 303మంది కరోనా సోకినవారు ప్రాణాలు కోల్పోయారు.
- vamsi
- Published On : June 13, 2021 / 11:10 AM IST
India Registers 80834 New Covid 19 Cases Lowest In 71 Days
Corona Update: దేశంలో రోజువారీ కరోనావైరస్ సోకినవారి సంఖ్య 71 రోజుల తరువాత చాలా తక్కువగా నమోదైంది. ఆరోగ్య మంత్రిత్వశాఖ లేటెస్ట్ లెక్కల ప్రకారం, గత 24గంటల్లో కొత్తగా 80,834 కొత్త కరోనా కేసులు వచ్చాయి. 3వేల 303మంది కరోనా సోకినవారు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో.. కరోనా కారణంగా లక్షా 32వేల మంది కోలుకున్నారు. అంటే, 54,531 క్రియాశీల కేసులు తగ్గాయి. చివరిసారిగా 2021 మార్చి 31న 72,330 కేసులు నమోదయ్యాయి.
కరోనా కేసుల తాజా పరిస్థితి:
మొత్తం కరోనా కేసులు – 2కోట్ల 94లక్షల 39వేల 989కేసులు
కోలుకున్నవారు- రెండు కోట్ల 80లక్షలు 43వేల 446మంది
క్రియాశీల కేసులు – 10లక్షల 26 వేల 159మంది
మరణాలు- 3లక్షల 70వేల 384కేసులు
దేశంలో కొత్తగా కరోనా వైరస్ కేసుల కంటే వరుసగా 31వ రోజు, ఎక్కువ రికవరీలు ఉన్నాయి. జూన్ 12 వరకు దేశవ్యాప్తంగా 25 కోట్ల 31 లక్షల కరోనా వ్యాక్సిన్ మోతాదులను ఇచ్చారు. చివరి రోజు 34 లక్షల 84 వేల వ్యాక్సిన్లు ఇచ్చారు. అదే సమయంలో ఇప్పటివరకు 37కోట్ల 81లక్షల కరోనా పరీక్షలు జరిగాయి. చివరిరోజు 19లక్షల కరోనా పరీక్షలు జరిగాయి. పాజిటివిటీ రేటు 4 శాతంగా ఉంది.
దేశంలో కరోనా మరణాల రేటు 1.25 శాతం కాగా, రికవరీ రేటు 95 శాతానికి మించిపోయింది. యాక్టివ్ కేసులు 4శాతం కన్నా తక్కువకు వచ్చాయి. కరోనా యాక్టివ్ కేసుల విషయంలో భారత్ ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. కరోనా సోకినవారి సంఖ్య ప్రకారం భారతదేశం రెండవ స్థానంలో ఉంది. అమెరికా తరువాత ప్రపంచంలో, భారతదేశంలో అత్యధిక మరణాలు బ్రెజిల్లో నమోదయ్యాయి.
