Israel : హమాస్ ముష్కరుల ఆకస్మిక దాడులతో ఇజ్రాయెల్ దేశంలోని స్డెరోట్ పట్టణంలోని రోడ్లపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. హమాస్ దాడి అనంతరం 12 గంటల తర్వాత దక్షిణ ఇజ్రాయెల్ పట్టణం స్డెరోట్లో పలు మృతదేహాలు, బుల్లెట్ రంధ్రాలున్న వాహనాలను తాను చూసినట్లు ఇజ్రాయెలీ వ్యక్తి వెల్లడించారు. ఆదివారం సెలవు దినం కావడంతో తాను ఇంట్లో నిద్రిస్తుండగా ఆరు గంటలకు సైరన్, పేలుళ్లు వినిపించాయి. దీంతో నేను ఇంటర్నెట్ లో చూడగా, ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని తెలుసుకొని బయటకు వెళ్లాను. స్డెరోట్ పట్టణ రోడ్డుపై మృతదేహాల చెల్లాచెదురుగా పడి ఉండటం చూశాను.
Read Also :Bollywood Actor : ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా…నేలమాళిగలో సురక్షితం
ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తోందో తెలియదు’’ అని స్టెరోట్ పట్ణణానికి చెందిన ష్లోమి ఆవేదనగా చెప్పారు. తాను మృతదేహాల మధ్య ఓ కుక్కను చూశానని ఓ జర్నలిస్ట్ చెప్పారు. ఇజ్రాయెల్ గ్రామాల్లోకి ప్రవేశించిన ముష్కరులు ప్రజలను చంపి, బందీలను గాజాకు తీసుకువెళ్లారు. ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలు స్డెరోట్లోని ఒక రహదారిపై పడి ఉన్నాయి. రోడ్డు చుట్టూ పగిలిన గాజులు ఉన్నాయి. ఒక మహిళ,మరో వ్యక్తి కారులో ముందు సీట్లలో అడ్డంగా పడి చనిపోయారు.
Read Also : Israel : హమాస్ దాడి ఎఫెక్ట్..ఇజ్రాయెల్కు ఎయిర్ ఇండియా విమానాల రద్దు
స్డెరోట్ పట్టణం గాజా నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. గతంలో పాలస్తీనా షెల్లింగ్ దాడుల భారాన్ని స్డెరోట్ పట్టణం భరించింది. గాజాలో ప్రారంభమైన దాడి వెస్ట్ బ్యాంక్, జెరూసలేంకు వ్యాపిస్తుందని హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే చెప్పారు. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ప్రతిస్పందించింది.
Read Also : Earthquakes : అప్ఘానిస్థాన్లో 8 సార్లు భూ ప్రకంపనలు…320 మంది మృతి