Israel : హమాస్ దాడి ఎఫెక్ట్..ఇజ్రాయెల్కు ఎయిర్ ఇండియా విమానాల రద్దు
ఇజ్రాయెల్పై హమాస్ దాడి నేపథ్యంలో ఆదివారం ఆ దేశానికి ఎయిర్ ఇండియా విమానాల రాకపోకలను నిలిపివేసింది. శనివారం ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేయడంతో ఎయిర్ ఇండియా టెల్ అవీవ్కు బయలుదేరే విమానాలను రద్దు చేసింది....
Israel : ఇజ్రాయెల్పై హమాస్ దాడి నేపథ్యంలో ఆదివారం ఆ దేశానికి ఎయిర్ ఇండియా విమానాల రాకపోకలను నిలిపివేసింది. శనివారం ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేయడంతో ఎయిర్ ఇండియా టెల్ అవీవ్కు బయలుదేరే విమానాలను రద్దు చేసింది. మిలిటెంట్ గ్రూప్ చేసిన దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ యుద్ధ స్థితి ప్రకటించింది.ఈ దాడుల్లో 200 మందికి పైగా ఇజ్రాయిలీలు మరణించగా,వెయ్యి మంది గాయపడ్డారు. ‘‘మా ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా ఢిల్లీ నుంచి టెల్ అవీవ్ కు వెళ్లే ఏ1139 ఎయిర్ ఇండియా విమానం, టెల్ అవీవ్ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణంలో ఏ 1140 విమాన సర్వీసులను రద్దు చేశాం’’ అని ఎయిర్ ఇండియా తెలిపింది.
Bollywood Actor : ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా…నేలమాళిగలో సురక్షితం
హమాస్ ఇజ్రాయెల్పై అపూర్వమైన దాడి తర్వాత వాణిజ్య విమానయాన సంస్థ రద్దు చేసినట్లు ప్రకటించింది. తీవ్రవాద బృందం గాజా నుంచి రాకెట్ల వర్షంతో కాల్పులు జరిపింది. యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు శనివారం ఒక సలహా జారీ చేసింది. ఇజ్రాయెల్లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ప్రోటోకాల్లను పాటించాలని అధికారులు కోరారు. హమాస్ శనివారం ఉదయం గాజా నుంచి 5,000 రాకెట్లను ప్రయోగించింది. గాజా స్ట్రిప్లోని హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ సైన్యం ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్ ప్రకటించింది.