Mata Vaishno Devi Temple : సముద్రమట్టానికి 5200 అడుగుల ఎత్తులో జమ్మూ కశ్మీర్లోని త్రికూట పర్వత గుహలో వెలసిన వైష్ణో దేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొత్త సంవత్సరంలో చల్లగా చూడు తల్లీ అంటూ వేడుకున్నారు. 2023 సంవత్సరం ఎంటర్ అవుతున్న క్రమంలో భక్తలు వైష్ణోదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులతో ఆలయ ప్రాంతాలన్నీ కిటకిటలాడిపోయాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులు భారీగా తరలిరావటంతో కొత్త సంవత్సరం ఆగమనం అంతా అమ్మవారి ఆలయంలోనే కనిపిస్తోంది. అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తోంది.
Vaishno Devi Temple : వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట.. 12 మంది మృతి
2022 కొత్త ఏడాది సమయంలో కూడా వైష్ణో దేవి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12మంది ప్రాణాలు కోల్పోగా..30 మందికిపైగా గాయపడ్డారు. ఇటువంట విషాద ఘటనలు మరోసారి జరగకుండా ఆలయ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. ఆలయ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
Jammu & Kashmir | Huge rush of devotees is being witnessed at Mata Vaishno Devi Shrine in Katra ahead of New Year 2023. pic.twitter.com/W4NipqwFLa
— ANI (@ANI) December 31, 2022
Vaishno Devi shrine : కారణం అదే..వైష్లోదేవి ఆలయంలో తొక్కిసలాటపై డీజీపీ