జార్ఖండ్లో తొది దశ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి చేతుల్లో పిస్తోల్ తీసుకుని తిరగడం…సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తొలి విడతలో భాగంగా ఆరు జిల్లాలోని 13 శాసనసభ నియోజకవర్గాల్లో 2019, నవంబర్ 30వ తేదీ శనివారం పోలింగ్ జరుగుతోంది. కోషియారా జిల్లాలోని పాలములోని పోలింగ్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
బీజేపీ అభ్యర్థి అలోక్ చౌరాషియా మద్దతు దారులు, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలింగ్ బూత్లోకి వెళ్లకుండా..కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి త్రిపాఠిని బీజేపీ వర్గీయులు ఆపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో త్రిపాఠి వెంటనే తన పిస్తోలును చూపించారు. పోలీసులు ఆ సమయంలో అక్కడనే ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు..త్రిపాఠిని కస్టడీలోకి తీసుకుని కొద్దిసేపటి అనంతరం రిలీజ్ చేశారు.
Read More : మహా “బల పరీక్ష”లో ఉద్దవ్ విజయం
> ఝార్ఖండ్లో 81 అసెంబ్లీ నియోజకవర్గాలన్నాయి.
> జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు కలిసి మహాకూటమిగా పోటీ చేస్తున్నాయి. ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
> తొలి దశ ఎన్నికల్లో 189 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
> 3 వేల 906 పోలింగ్ కేంద్రాలున్నాయి.
> 2020 జనవరి 05తో రాష్ట్రంలో ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది.
> నవంబర్ 30న తొలి దశ పోలింగ్.
> డిసెంబర్ 07న రెండో దశ.
> డిసెంబర్ 12న మూడో దశ.
> డిసెంబర్ 16న నాలుగో దశ.
> డిసెంబర్ 20న ఐదో దశ.
> డిసెంబర్ 23న ఎన్నికల ఫలితాలు.
#WATCH Jharkhand: Congress candidate KN Tripathi brandishes a gun during clash between supporters of BJP candidate Alok Chaurasia & Tripathi’s supporters. Tripathi was allegedly stopped by BJP candidate’s supporters from going to polling booths, in Kosiyara village of Palamu. pic.twitter.com/Ziu8eCq42z
— ANI (@ANI) November 30, 2019