Maharashtra: కీలక విపక్ష నేతలను భద్రతను కుదించిన మహారాష్ట్ర ప్రభుత్వం
అనిల్ దేశ్ముఖ్, ఛాగన్ భుజ్పాల్, బాలాసాహేబ్ థోరట్, నితిన్ రౌత్, నానా పటోలె, జయంత్ పాటిల్, సంజయ్ రౌత్, విజయ్ వాడేట్టివార్, ధనుంజయ్ ముండే, నవాబ్ మాలిక్, నరహరి జిర్వాల్, సునిల్ కేదార్, అస్లామ్ షైక్, అనిల్ పరబ్ సహా మరి కొందరి నేతల భద్రతను తగ్గించారు. ఇంకొందరి నేతల భద్రతను పూర్తిగా తొలగించారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విపక్షాలు ఇప్పటి వరకు స్పందించలేదు.
- tony bekkal
- Published On : October 29, 2022 / 12:43 PM IST
Maharashtra Government Removes Security Of Several Key Opposition Leaders
Maharashtra: ఏక్నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. విపక్ష పార్టీలకు కీలక నేతలకు భద్రతను కుదించారు. కొందరి నేతల భద్రతను పూర్తిగా తొలగించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఉద్ధవ్ థాకరే వర్గం లక్ష్యంగా ఈ మార్పులు చేశారు. ఎన్సీపీ నేత, రాష్ట్ర విపక్ష నాయకుడు అజిత్ పవార్ సహా దిలిప్ వాల్సే పాటిల్ భద్రతను వై ప్లస్ కేటగిరీ నుంచి జెడ్ కేటగిరీకి తగ్గించారు.
ఇక అనిల్ దేశ్ముఖ్, ఛాగన్ భుజ్పాల్, బాలాసాహేబ్ థోరట్, నితిన్ రౌత్, నానా పటోలె, జయంత్ పాటిల్, సంజయ్ రౌత్, విజయ్ వాడేట్టివార్, ధనుంజయ్ ముండే, నవాబ్ మాలిక్, నరహరి జిర్వాల్, సునిల్ కేదార్, అస్లామ్ షైక్, అనిల్ పరబ్ సహా మరి కొందరి నేతల భద్రతను తగ్గించారు. ఇంకొందరి నేతల భద్రతను పూర్తిగా తొలగించారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విపక్షాలు ఇప్పటి వరకు స్పందించలేదు.
