డిసెంబర్ 31 వరకు రాత్రి కర్ప్యూ

  • Publish Date - November 28, 2020 / 01:51 PM IST

Manipur  imposes night curfew till December 31st : కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా మణిపూర్ ప్రభుత్వం ఈ ఏడాది చివరి వరకు రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేయనుంది.  సాయంత్రం  6గంటల నుంచి తెల్లవారు ఝూమున 4గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కోంది.




https://10tv.in/bopal-covxin/
అత్యవసరమైన సేవలు, గూడ్స్ ట్రక్కులు, విధుల్లో ఉన్న అధికారులకు మాత్రమే ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే మతపరమైన, ఇతర వేడుకల్లో పాల్గొనే వారి సంఖ్య 20కి కుదించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. రాష్ట్రంలో 3,245 క్రియాశీల కేసులు ఉన్నాయి. శీతాకాలం నేపథ్యంలో వైరస్‌ ఉధృతి పెరిగే అవకాశం ఉండడంతో మణిపూర్ ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది.