Rape On Minor Girl : మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. చనిపోయినా వదల్లేదు

16 ఏళ్ల బాలికలపై అత్యాచారం చేసి దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బుండీకి చెందిన బాలిక గత నెల 23న మేకలు మేపడానికి అడవికి వెళ్లి కామాంధుల చేతిలో బలైంది.

Rape On Minor Girl : 16 ఏళ్ల బాలికలపై అత్యాచారం చేసి దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బుండీకి చెందిన 16 ఏళ్ల బాలిక గత నెల 23 న మేకలు మేపడానికి అడవికి వెళ్లి అదృశ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక కోసం గాలింపు చేపట్టారు. బుండీకి సమీపంలోని అడవుల్లో బట్టలు లేకుండా ఓ మృతదేహం స్థానికులకు కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

చదవండి : Girls Raped : పోలీసునంటూ బెదిరించి ఇద్దరు గిరిజన బాలికలపై అత్యాచారం

ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహం స్వాధీనం చేసుకొని డిసెంబర్ 23న కనిపించకుండా పోయిన బాలిక మృతదేహమని నిర్దారించారు. అనంతరం బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టంలో సంచలన విషయాలు బయటపడ్డాయి.. ఆమెపై అత్యాచారం జరిగినట్లు తేలింది.. బాలిక ప్రైవేట్ భాగాల్లో 30 గాయాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాలికను హత్యచేసి తర్వాత అత్యాచారం చేసినట్లు పోస్టుమార్టం రీపోర్టులో పేర్కొన్నారు.

చదవండి : Gang Rape In MP : దివ్యాంగ బాలికపై గ్యాంగ్ రేప్..ఇద్దరు అరెస్ట్

ఇక ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. మొత్తం ముగ్గురు యువకులు ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. ఇక స్థానికులు ఆ ముగ్గురికి బహిరంగ శిక్ష విధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నరరూప రాక్షసులకు బహిరంగ శిక్ష వేస్తేనే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగవని.. ఎన్‌కౌంటర్ చెయ్యాలని పోలీసులను కోరారు.

ట్రెండింగ్ వార్తలు