మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా మాలేగావ్లో విషాదం చోటు చేసుకుంది. నలుగురు కుమార్తెలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది.
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా మాలేగావ్లో విషాదం చోటు చేసుకుంది. నలుగురు కుమార్తెలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది. బావిలో మహిళతోపాటు నలుగురు కుమార్తెల మృతదేహాలను స్థానికులు గుర్తించారు.
గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.