ప్రియుడితో రాసలీలలు… ఏడుస్తూ, డిస్టర్బ్ చేస్తున్నాడని 6 ఏళ్ల కొడుకుని చంపేసిన తల్లి

  • Publish Date - April 28, 2020 / 05:07 AM IST

కన్న బిడ్డ ఆకలి కంటే పడక సుఖమే ముఖ్యం అనుకుంది ఓ మహాతల్లి. ప్రియుడితో ఉన్నప్పుడు ఆకలితో ఏడ్చాడని కన్న బిడ్డను కసి తీరా కొట్టింది. ఆదెబ్బలకు బిడ్డ కన్నుమూశాడు. తమిళనాడు, కోయంబత్తూరులోని  కోయిల్మేడు ప్రాంతానికి చెందిన దివ్య(30) కు కొన్నాళ్ల క్రితం  అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తితో వివాహం అయ్యింది. వారికి ఇద్దరు పిల్లలు. వైవాహిక జీవితం సాఫిగా సాగిపోతున్నవేళ  కుటుంబంలో కలతలు. భార్యా భర్తలిద్దరూ విడిపోయారు.  భర్తతో విడిపోయాక దివ్య పిల్లలిద్దర్ని తీసుకుని  తుడియలూరు కు మకాం మార్చింది.  

అక్కడు ఉండగా దివ్యకు రాజదురై అనే స్ధానిక యువకుడితో పరిచయం ఏర్పడింది.  క్రమంగా అది వారిద్దరి మధ్య వివాహేతర సంబధానికి దారితీసింది. అవకాశం ఉన్నప్పుడల్లా ఇద్దరూ శారీరకంగా కలిసేవారు. కొంత కాలం  గడిచాక ….ఇలా కాదనుకుని ఇద్దరూ కలిసి  కొద్ది రోజుల క్రితం సాయిబాబా కాలనీలో ఇల్లు తీసుకుని అక్కడికి మారి సహజీవనం చేయటం ప్రారంభించారు. 

 

ఇద్దరూ ఒకే ఇంటిలోకి చేరటంతో ఇంక వారి ఆనందానికి అడ్డే లేకుండా పోయింది. పైగా లాక్‌డౌన్. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దివ్య , ప్రియుడు రాజదురై‌తో ఉన్నప్పుడు ఉన్నప్పుడు పిల్లల్ని బయటకు పంపిస్తుండేది. ఇలాగే మంగళవారం కూడా రాజదురైతో ఉన్నప్పుడు కొడుకు అభిషేక్ ను దివ్య బయటకు పంపింది. 

బయట కూర్చున్న అభిషేక్  ఆకలి వేయటంతో ఏడ్వసాగాడు. ప్రియుడితో శారీరకంగా కలసిఉండగా …కొడుకు ఏడవటంతో దివ్యకు చిర్రెత్తుకొచ్చింది.  వెంటనే బయటకు వచ్చి పిల్లాడ్నిదారుణంగా చితకబాదింది.  దీంతో  పిల్లావాడు అపస్మారక స్ధితి లోకి వెళ్లిపోయాడు. 

కంగారు పడిన దివ్య, రాజదురై 108 అంబులెన్స్ పిలిపించి పిల్లవాడ్ని ఆస్పత్రికి తీసుకువెళ్లారు.  పిల్లవాడికి ఏమైందని  108 సిబ్బంది అడగ్గా  ఆడుకుంటూ ప్రమాదంలో గాయపడ్డాడని చెప్పింది.  దివ్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన 108 సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.  

 

ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు దివ్య, రాజదురైను అదుపులోకి తీసుకున్నారు. బాలుడ్ని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు.   పోలీసులు గట్టిగా అడిగే సరికి తానే చంపామని దివ్య, అమె బాయ్ ఫ్రెండ్ ఒప్పుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  విచారిస్తున్నారు.