Mumbai Airport : ముంబయి విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. తనకు బిట్కాయిన్లో 1 మిలియన్ డాలర్లు చెల్లించకుంటే 48 గంటల్లో ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన టెర్మినల్ 2ను పేల్చివేస్తామని ఓ ఆగంతకుడు ఈమెయిల్ ద్వారా బెదిరించారు. ఈ మేరకు ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఫీడ్బ్యాక్ ఇన్బాక్స్కు గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది.
ఈమెయిల్ పంపిన వ్యక్తి పేలుడును నివారించడానికి 48 గంటల్లో బిట్కాయిన్లో 1 మిలియన్ డాలర్లు పంపించాలని డిమాండ్ చేశాడు. బెదిరింపు ఈ మెయిల్ పంపిన గుర్తుతెలియని వ్యక్తిపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. ‘‘విమానాశ్రయానికి చివరి హెచ్చరిక. బిట్కాయిన్లోని ఒక మిలియన్ డాలర్లను చిరునామాకు బదిలీ చేయకపోతే మేం 48 గంటల్లో ముంబయి విమానాశ్రయంలోని టెర్మినల్ 2ని పేల్చివేస్తాం. 24 గంటల తర్వాత మరో హెచ్చరిక ఉంటుంది’’ అని ఆగంతకుడు ఈమెయిల్ లో హెచ్చరించాడు.
ALSO READ : Dhruva Natchathiram : రిలీజ్కి ఒక్క రోజు ముందు.. మళ్ళీ వాయిదా పడ్డ ధ్రువ నక్షత్రం..
బాంబులతో విమానాశ్రయాన్ని పేల్చివేస్తామనే బెదిరింపుపై ముంబయి పోలీసులు ఐపీసీ 385,505(1) బి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గతంలోనూ ముంబయి విమానాశ్రయానికి తరచూ బాంబు పెట్టామంటూ పలు సార్లు బెదిరింపులు వచ్చాయి. ఇలా బెదిరింపులు వచ్చిన ప్రతీసారి విమానాశ్రయం అధికారులు అప్రమత్తమై పోలీసు బలగాలతో ముమ్మర తనిఖీలు చేశారు. ఈ బెదిరింపుతో ముంబయి విమానాశ్రయంలో హైఅలర్ట్ ప్రకటించారు.