Highway Toll Revises: గుడ్ న్యూస్.. టోల్ చార్జీలు భారీగా తగ్గనున్నాయ్.. తెలుగు రాష్ట్రాల వారికి స్పెషల్ గా..
నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్ చార్జీలను(Highway Toll Revises) లెక్కించే విధానంలో కీలక మార్పులు చేసింది.
- V Santhosh Kumar
- Published on- July 27, 2026 / 12:12 PM IST
Nhai revises highway toll calculation formula cheaper travel charges
- హైవేలపై తగ్గనున్న టోల్ చార్జీలు
- కొత్త ఫార్ములా తెచ్చిన NHAI
- వాహనదారులకు లభించనున్న భారీ ఉపశమనం
Highway Toll Revises: దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తీపి కబురుందించింది. బ్రిడ్జిలు, టన్నెళ్లు, ఫ్లైఓవర్లు మరియు ఎలివేటెడ్ కారిడార్లు వంటి ఖరీదైన మౌలిక సదుపాయాలు ఉన్న హైవే లెంత్పై టోల్ చార్జీలను(Highway Toll Revises) లెక్కించే విధానంలో కీలక మార్పులు చేసింది. ఈ మేరకు ‘నేషనల్ హైవేస్ ఫీజ్ రూల్స్’కు సవరణలు చేస్తూ కొత్త ఫార్ములాను తీసుకొచ్చింది. గతంలో నిర్మాణం, నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయనే నెపంతో ప్రతి 1 కిలోమీటరు బ్రిడ్జి లేదా టన్నెల్ నిర్మాణాన్నే 10 కిలోమీటర్ల సాధారణ రహదారితో సమానంగా పరిగణించి టోల్ వసూలు చేసేవారు. దీనివల్ల ప్రయాణికులపై తీవ్ర ఆర్థిక భారం పడేది.
కొత్త ఫార్ములా ఎలా పనిచేస్తుంది?
నూతన నిబంధనల ప్రకారం.. ఇకపై టోల్ దూర నిర్ణయంలో రెండు ఆప్షన్లను పరిశీలించి, ఏది తక్కువైతే దాన్నే ప్రామాణికంగా తీసుకోనున్నారు. మొదటిది- నిర్మాణం పొడవుకు 10 రెట్లు కాగా, రెండోది- సాధారణ రోడ్డు, వంతెనల మొత్తం పొడవుకు 5 రెట్లు. ఈ రెండింటిలో ఏ సంఖ్య తక్కువ ఉంటే దానికి అనుగుణంగానే టోల్ ఫీజును ఖరారు చేస్తారు. ఉదాహరణకు 40 కిలోమీటర్ల పరిధిలోని రోడ్డులో 10 కిమీ ఎలివేటెడ్ రోడ్డు ఉంటే, పాత పద్ధతిలో 130 కిమీ దూరానికి టోల్ కట్టాల్సి వచ్చేది. కానీ కొత్త ఫార్ములా వల్ల కేవలం 100 కిమీ దూరానికే లెక్కించనుండటంతో టోల్ ప్రయాణ దూరం సుమారు 23 శాతానికి పైగా తగ్గుతుంది.
ఎవరికి ఎక్కువ ప్రయోజనం?
సుదీర్ఘమైన టన్నెళ్లు, సముద్రపు బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లతో నిర్మించిన ఎలివేటెడ్ కారిడార్లలో ప్రయాణించే వాహనదారులకు ఈ నిర్ణయం ద్వారా గరిష్టంగా 40 శాతం వరకు టోల్ చార్జీలు తగ్గే అవకాశముంది. ప్రాజెక్టు ఖర్చులను రాబట్టుకోవడంతో పాటు ప్రయాణికులకు కూడా రీజనబుల్ ఛార్జీలను అందించడమే లక్ష్యంగా NHAI ఈ నిర్ణయాన్ని వేగంగా అమలు చేస్తోంది. త్వరలోనే ఫీల్డ్ ఆఫీసుల ద్వారా కొత్త నోటిఫికేషన్లు విడుదల కానుండటంతో, హైవే ప్రయాణాలు మరింత చౌకగా మారనున్నాయి.
