Mumbai : కొట్లాటలు, అరుపులు మర్చిపోయారు.. ట్రైన్‌లో కిషోర్ కుమార్ పాట పాడుతూ ఎంజాయ్ చేసిన ప్రయాణికులు

ఎప్పుడు కొట్లాటలతో అరుపులతో సాగే ముంబయి లోకల్ ట్రైన్ జర్నీ చక్కని కిషోర్ కుమార్ పాటతో హాయిగా సాగింది. ఈ వీడియో చూసేవారి మనసుని దోచుకుంది.

Mumbai

Mumbai : ముంబయి మహానగరంలో లోకల్ ట్రైన్ ప్రయాణం ఎలా ఉంటుందో? ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ కష్టాలు మర్చిపోతూ జర్నీ చేసే ప్రయాణికులు కూడా ఉన్నారు. రీసెంట్‌గా కిషోర్ కుమార్ సాంగ్ పాడుతూ జర్నీని ఎంజాయ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

Mumbai : తాగి పారేసిన టెట్రా పాక్ డబ్బాలతో స్కూలు డెస్క్‌లు, బెంచీలు.. నిరుపేద విద్యార్ధులకు ముంబయివాసుల సాయం

ముంబయి లోకల్ ట్రైన్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఉద్యోగాలు, కాలేజీలు.. ఇతర పనుల మీద వెళ్లేవారితో  నిత్యం జనంతో కిటకిటలాడుతుంది. ఈ ఎండల్లో లోకల్ ట్రైన్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆ కష్టాన్ని మర్చిపోతూ హాయిగా కిషోర్ కుమార్ సాంగ్ ‘ఓ మేరే దిల్ కే చైన్’ పాడుకుంటూ.. స్టెప్పులు కూడా వేస్తూ ఎంజాయ్ చేసారు కొందరు ప్రయాణికులు. sashankpandeyy అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ‘ఎవరు చెప్పారు మేము లోకల్ ట్రైన్‌లో ఫైటింగ్స్ మాత్రమే చేస్తామని’ అనే శీర్షికతో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Unfriendliest Cities : ‘అన్ ఫ్రెండ్లీ’ నగరాలుగా ముంబయి, ఢిల్లీ.. తాజాగా తేల్చిన సర్వే

నిత్యం కొట్లాటలు.. అరుపులతో సాగే రైలు ప్రయాణం చక్కని పాటతో హాయిగా సాగడం చూసేవారి మనసు కూడా దోచుకుంది. సంగీతం ప్రయాణాన్ని ఎంత ఉల్లాసంగా మార్చేస్తుందో.. ఎంత స్నేహ పూర్వక వాతావరణాన్ని సృష్టిస్తుందో ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు