Plane Crash Landed
Plane Crash-Landed : గతేడాది మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఓ చిన్న విమానం క్రాష్ ల్యాండైంది. ఇప్పుడా విమాన పైలెట్ కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం దిమ్మదిరిగే జరిమానా విధించింది. ఏకంగా రూ.85కోట్లు చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఆ పైలెట్ బిత్తరపోయాడు.
అసలేం జరిగిందంటే… గతేడాది కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తున్న సమయంలో పైలెట్ కెప్టెన్ మాజిద్, తన కో పైలెట్ తో కలిసి మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున కరోనా శాంపిల్స్, ఔషధాలను మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విమానంలో తరలించారు. కెప్టెన్ మాజిద్ కు వైమానిక రంగంలో 27ఏళ్ల అనుభం ఉంది. అయితే, 2021 మే 6న ఎయిర్ క్రాఫ్ట్(Beech Craft King Air B 250 GT) లో 71 బాక్సుల రెమ్ డెసివిర్ ఔషధాలతో అహ్మదాబాద్ నుంచి గ్వాలియర్ పయనం అయ్యాడు. కాసేపట్లో గ్వాలియర్ లో ల్యాండ్ కావాల్సి ఉంది. ఇంతలో ఊహించని ఘోరం జరిగింది.
Tea Bags : టీ బ్యాగ్స్ వాడుతున్నారా?…మీ ఆరోగ్యం డేంజర్లో పడ్డట్టే…
గ్వాలియర్ ఎయిర్ పోర్టులో దిగుతుండగా, రన్ వేపై ఏర్పాటు చేసిన ఇనుప కంచెను బలంగా ఢీకొంది. దాంతో విమానం ఆ కంచెకు చిక్కుకుని క్రాష్ ల్యాండైంది. ఆ సమమంలో విమానంలో పైలెట్ మాజిద్ అక్తర్, కో పైలెట్ శివ్ జైస్వాల్, రాష్ట్ర ప్రభుత్వ అధికారి దిలీప్ ద్వివేది ఉన్నారు. వారు ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విమానం మాత్రం పనికిరాకుండా పోయింది. ఈ ఘటన తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఇండియాస్ సివిల్ ఏవియేషన్ రెగులేటర్ పైలెట్ అక్తర్ పై చర్యలు తీసుకుంది. అతడి ఫ్లైయింగ్ లైసెన్స్ ను ఏడాది పాటు సస్పెండ్ చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దీనిపై విచారణ జరిపింది.
దీనిపై విచారణ జరిపిన రాష్ట్ర ప్రభుత్వం.. భారీ మొత్తంలో బిల్లు చెల్లించాలని పైలెట్ ను ఆదేశించింది. తమ విమానం తుక్కు కింద మారిందని, అందుకు రూ.60 కోట్లు, ఇతర కంపెనీల నుంచి విమానాలు అద్దెకు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అందుకుగాను మరో రూ.25 చెల్లించాలంది.
Facebook: ఫేస్బుక్కి రూ.1500కోట్ల జరిమానా.. ఎందుకంటే?
ప్రభుత్వం ఆదేశాలతో పైలెట్ మాజిద్ బిత్తరపోయాడు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. రన్ వేపై ఇనుప కంచె అవరోధం ఉన్నట్టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తనకు సమాచారం ఇవ్వకపోతే తాను ఏం చేయగలనని వాపోయాడు. కనీసం ఆ విమాన బ్లాక్ బాక్స్ ను అందించినా, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని అంటున్నాడు. విమానాన్ని ప్రయాణాలకు అనుమతి ఇవ్వడానికి ముందు బీమా చేయించకపోతే ఆ తప్పు ఎవరిదో విచారణ జరిపించాలని పైలెట్ మాజిద్ డిమాండ్ చేస్తున్నాడు. కాగా, ఈ ఎయిర్ క్రాఫ్ట్ ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2019లో రూ.65 కోట్లకు కొనుగోలు చేసింది.