Modi
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర మంత్రులుగా రాజ్నాథ్ సింగ్, అమిత్ షా సహా పలువురు ఎంపీలు ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమానికి పలు దేశాల అధినేతలు, భారత్ లోని పలు పార్టీల అధినేతలు కూడా హాజరయ్యారు. ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ హాజరయ్యారు. అలాగే, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి
విశాల భారతం…. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం..లెక్కకు మించిన కులమతాలు… విభిన్న భాషలు, భిన్న సంస్కృతులు…. అనేక రాజకీయ వైరుధ్యాలు…. నేతలపై నమ్మకం కోల్పోతున్న ప్రజలు…రాజకీయాలపై ఓ విధమైన ఏహ్య భావం….రాష్ట్రాలపై వారసత్వ కుటుంబాల ఆధిపత్యం….ప్రాంతీయ పార్టీలకు పెరుగుతున్న ఆదరణ…. ఉనికి కోల్పోతున్న జాతీయ పార్టీలు… ఇలాంటి పరిస్థితులున్న చోట…ఒకే ఒక్కడు… తానే ఓ గ్యారంటీ అని ప్రకటించి… ఎన్నికల కురుక్షేత్రంలో నిలిచిగెలిచారు.
నాయకత్వానికి అసలైన అర్థం చెప్పారు. సమయానుకూల రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలోనూ సిద్దహస్తుడిగా మారారు. ఎన్నికల ప్రచార వ్యూహాలతో ఓట్లు రాబట్టుకోవడంలోనూ, ఫలితానంతర పరిణామాలను అంచనా వేసి..తనకు అనుగుణంగా మార్చుకోవడంలో ఆరితేరారు. అంతిమంగా ఓ చరిత్ర సృష్టిస్తున్నారు. తనకవసరమైనప్పుడు చరిత్రే కొందరిని సృష్టిస్తుందన్న నమ్మకాన్ని కల్పిస్తున్నారు. ఆయనే ప్రధాని మోదీ. జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టారు.
తెలంగాణలో ఇక ఈ లక్ష్యంతోనే బీజేపీ నేతలు పనిచేయాలి: కిషన్ రెడ్డి